News February 22, 2025

VKB: 100 ఏళ్ల నుంచి ఎండిపోని ఊట

image

వంద సంవత్సరాల నుంచి జాంబాపూర్, కోటం గుట్ట తండాల మధ్యలో ఊట ఎండిపోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. దాదాపు 85 సంవత్సరాలుగా ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారని అంటున్నారు. బోర్లు, మిషన్ భగీరథ నీళ్లు వచ్చాక ఊట నీరు తాగడం మానేశారని తెలిపారు. ఇప్పుడు పశువుల దాహార్తిని ఈ ఊట తీరుస్తుందంటున్నారు. 

Similar News

News March 26, 2025

YS జగన్ పెద్దమ్మ మృతి

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్దమ్మ సుశీలమ్మ(85) ఇవాళ పులివెందులలో కన్నుమూశారు. ఈమె దివంగత వైఎస్సార్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి. ఆస్పత్రిలో ఉన్న ఆమెను 2 నెలల కిందట జగన్ పరామర్శించారు. సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది. అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది.

News March 26, 2025

జగిత్యాల: గణితం పరీక్షకు రెగ్యూలర్‌కు 5 విద్యార్థులు గైర్హాజరు

image

పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా నాలుగోరోజు గణితం పేపర్ రెగ్యులర్ పరీక్ష కేంద్రాలలో మొత్తం 11855 విద్యార్థులకు 11850 విద్యార్థులు హాజరయ్యారు. 5 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.96%.సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 133 విద్యార్థులకు 119 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి హాజరు శాతము 89.47% అని అధికారులు తెలిపారు.

News March 26, 2025

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సంత్రాగచ్చి, యశ్వంత్‌పూర్ మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 3 నుంచి 24 వరకు ప్రతి గురువారం SRC-YPR(నెం.02863), ఏప్రిల్ 5 నుంచి 26 వరకు ప్రతి శనివారం YPR- SRC(నెం.02864) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో గుంటూరు, రాజమండ్రి, దువ్వాడ, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

error: Content is protected !!