News March 4, 2025

VKB: 153 వాహనాలు సీజ్.. రూ.46,62,375 టాక్స్ వసూలు

image

జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖలో ఫిబ్రవరి 2025 సంవత్సరం ఒక్క నెలకి గాను ట్యాక్స్ చెల్లించని 153 వాహనాలను సీజ్ చేసి రూ.46,62,375 రూపాయల జరిమానాను ఒక్క నెలలోనే వసూలు చేసినట్లు వికారాబాద్ జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇంకా ట్యాక్స్ చెల్లించని వాహనదారులు ఆన్‌లైన్‌లో లేదా మీసేవా ద్వారా ట్యాక్స్ చెల్లించాలని ఆయన తెలిపారు. ట్యాక్స్ చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామన్నారు.

Similar News

News March 4, 2025

HYD: రాయదుర్గంలో యువతి సూసైడ్

image

రాయదుర్గంలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన దేవిక(25), సతీశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాయదుర్గంలో కాపురం పెట్టారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ మనస్తాపంతో దేవిక ఉరివేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 4, 2025

ICAI పరీక్షా ఫలితాల విడుదల

image

సీఏ ఇంటర్మీడియట్ కోర్సు ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ICAI) ఈరోజు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది జనవరిలో 11, 13, 15, 17, 19, 21 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News March 4, 2025

పార్వతీపురం: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా మంగళవారం 34 పరీక్ష కేంద్రాల్లో 9,437 మంది విద్యార్థులకు గాను 8,875 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 6,488 మంది జనరల్ విద్యార్థులకు 6,243 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,949మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,632 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.

error: Content is protected !!