News March 19, 2025

VKB: 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పది పరీక్షలు: డీఈవో

image

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకా దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో పది పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

Similar News

News November 28, 2025

ఏకగ్రీవాలకు వేలంపాటలు.. SEC వార్నింగ్

image

TG: సర్పంచ్ ఎన్నికల వేళ ఏకగ్రీవాలకు జోరుగా వేలంపాటలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ పదవిని అంగట్లో సరుకులా డబ్బులు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ప్రకటించేశారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాటలో కొనుగోలు చేయడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News November 28, 2025

IPLలో వైభవ్.. WPLలో దీయా

image

WPL వేలంలో హరియాణాకు చెందిన 16 ఏళ్ల దీయా యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించారు. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ అయిన ఆమెను రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. దీంతో WPLలో అడుగుపెట్టిన పిన్న వయస్కురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. 2023 U-15 ఉమెన్స్ ట్రోఫీలో 578 రన్స్ బాదడంతో దీయా పేరు తెరపైకి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ 13ఏళ్లకే IPLలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

News November 28, 2025

కృష్ణా: నాడు – నేడు పనులు.. పూర్తి చేస్తే బాగు..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు 90% పూర్తైనా, కూటమి ప్రభుత్వం వచ్చాక నిధుల లేమి కారణంగా అసంపూర్తిగా మారాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణాలో 100కు పైగా పాఠశాలల్లో మౌలిక వసతులు, 600 స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది.