News March 30, 2025

VKB: ‘25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’

image

ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నవారు పూర్తిస్థాయిలో రుసుము చెల్లించి ప్లాట్‌ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 31లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన వారికి ప్రభుత్వం 25% రాయితీని వర్తింపజేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 14, 2025

HNK: మెరుగైన సేవలు అందించాలి: DMHO

image

ఆరోగ్య సమస్యలతో ప్రాథమిక కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఓపికతో వారి సమస్యలను విని అవసరమైన సేవలు అందించాలని DMHO అప్పయ్య అన్నారు. ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అవుట్ పేషెంట్ రిజిస్టర్‌ని పరిశీలించి ఎంతమంది ఏ విధమైన సమస్యలతో వస్తున్నారని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

News November 14, 2025

జిల్లా వ్యాప్తంగా పంచారామాలకి బస్సులు

image

పంచారామ క్షేత్రాల దర్శనానికి కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం రాత్రి ఏలూరు జిల్లా వ్యాప్తంగా సెమీ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా అధికారి ఎస్‌కే షబ్నం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి డిపో నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News November 14, 2025

ASF: రోడ్డు సౌకర్యం కల్పించండి.. సీఎం ప్రజావాణిలో వినతి

image

ASF జిల్లాలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలని TAGS జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో ప్రజా భవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, మంగి, జోడేఘాట్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.