News March 19, 2025
VKB: CMకు ‘THANK YOU’ చెప్పిన ఎమ్మెల్యేలు

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు రూ.6000 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.
Similar News
News December 16, 2025
బాలయ్య నోట మరో పాట.. సాహోరే బాహుబలి తరహాలో!

నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా కోసం మరోసారి సింగర్గా మారబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించారు. సాహోరే బాహుబలి సాంగ్ తరహాలో ఈ పాట ఉంటుందని తెలిపారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. కాగా బాలయ్య గతంలో ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామా ఏక్ పెగ్ లా’ అనే సాంగ్ పాడారు. అప్పుడప్పుడూ మూవీ ఈవెంట్లలోనూ ఆయన తన సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరిస్తుంటారు.
News December 16, 2025
రామగుండం: ‘ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అమల్లో BNSS’

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉన్నట్లు తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని 9 మండలాల్లో 5 మందికిపైగా గుమిగూడద్దన్నారు. చట్టబద్ధమైన సమావేశం కోసం ముందస్తు అనుమతి తప్పనిసరని అన్నారు. ఈ ఉత్తర్వులు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు కొనసాగుతాయన్నారు.
News December 16, 2025
నల్గొండ: అభ్యర్థి చనిపోవడంతో ఓట్ల డబ్బును తిరిగిచ్చిన గ్రామస్థులు

మునుగోడు మండలం కిష్టాపురంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. చెనగోని కాటంరాజు బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసి ఓటమి తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన అంత్యక్రియల సందర్భంగా అతను ఓట్ల కోసం పంచిన డబ్బులను ఎస్సీ కాలనీ ఓటర్లు తిరిగి తన కొడుకు వంశీకి అందజేశారు. 11న జరిగిన ఎన్నికల్లో కాటంరాజు 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నగదును తిరిగి ఇవ్వడం పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు.


