News March 19, 2025
VKB: CMకు ‘THANK YOU’ చెప్పిన ఎమ్మెల్యేలు

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు రూ.6000 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.
Similar News
News March 19, 2025
ఎంతిస్తారో కూడా నాకు చెప్పలేదు: శశాంక్ సింగ్

రిటెన్షన్లో తనకు ఎంత ఇస్తారో కూడా తెలియకుండానే సంతకం చేశానని PBKS ప్లేయర్ శశాంక్ సింగ్ తెలిపారు. తాను వేలంలో లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. ‘గతంలో చాలాసార్లు నన్ను వేలంలో తిరస్కరించారు. తీసుకున్నా అవకాశాలు వచ్చేవి కావు. గత సీజన్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో రిటైన్ చేసుకున్నారు. రిటైన్ సమయంలో నాకు ఎంత ఇచ్చేది వారు చెప్పలేదు. నేనూ బేరమాడలేదు. ఫామ్పై సంతకం చేశా అంతే’ అని చెప్పుకొచ్చారు.
News March 19, 2025
‘RRR’లో మెయిన్ హీరో ఇతడే.. ‘GROK’ ద్వంద్వ వైఖరి!

సినిమాల విషయంలో ‘GROK’ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఫ్యాన్ వార్స్ సృష్టిస్తోంది. తాజాగా ‘RRR’ సినిమాలో మెయిన్ హీరో కొమురం భీమ్ క్యారెక్టర్లో నటించిన ఎన్టీఆర్ అని చెప్తోంది. గోండు జాతికి చెందిన భీమ్ బ్రిటిష్ వారి నుంచి మల్లిని కాపాడాడని ఉదహరిస్తోంది. రామ్ చరణ్ది కీలక పాత్ర అని చెప్తూనే.. మరికొందరికి ఇతనే మెయిన్ హీరో అని రిప్లై ఇస్తోంది. దీంతో ఫ్యాన్స్ మధ్య గందరగోళం నెలకొంది. మీ కామెంట్?
News March 19, 2025
బిల్గేట్స్ను ఏపీకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

AP: బిల్గేట్స్ ఫౌండేషన్తో పలు ఒప్పందాల అనంతరం సీఎం చంద్రబాబు బిల్గేట్స్ను అమరావతి, తిరుపతికి రావాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. 1995 నుంచి బిల్గేట్స్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం చెప్పారు. మరోవైపు, ఈ ఉదయం పార్లమెంట్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో CBN భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం చంద్రబాబు విజయవాడకు తిరుగుపయనం అయ్యారు.