News March 19, 2025

VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔పలుచోట్ల ఇఫ్తార్ విందు..పాల్గొన్న నేతలు
✔BC,SC బిల్లులకు ఆమోదం.. జిల్లా నేతల సంబరాలు
✔సిద్ధం.. 21 నుండి టెన్త్ పరీక్షలు:MEOలు
✔పరిగి: బొలోరో వాహనాన్ని ఢీ కొట్టిన కారు
✔VKB: ఆర్టీసీ డిపోకు 16 కొత్త బస్సులు
✔VKB: 21 నుంచి ఏప్రిల్ 3 వరకు పది పరీక్షలు: కలెక్టర్
✔ఇంటర్ పరీక్షలకు 178 మంది గైర్హాజరు
✔VKB: ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం

Similar News

News March 19, 2025

కరీంనగర్: నలుగురు విద్యార్థులు డీబార్

image

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2లో నలుగురు విద్యార్థులు డీబార్ అయినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 15,965 మంది విద్యార్థులకు గాను 15,563 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 402 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు.

News March 19, 2025

ఘోరం.. భర్తను ముక్కలుగా నరికిన భార్య

image

యూపీ మీరట్‌లో ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపింది. లండన్‌‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన సౌరభ్.. తన భార్య ముస్కాన్ బర్త్ డే కోసం ఫిబ్రవరి 24న ఇండియాకు వచ్చాడు. ప్రియుడు మోహిత్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న ముస్కాన్.. సౌరభ్‌ను చంపాలని ప్లాన్ చేసింది. అతడు రాగానే చంపి, ముక్కలుగా నరికి పెద్ద డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పారు. తాజాగా అతడి శరీర భాగాలు బయటపడ్డాయి. నిందితులు అరెస్ట్ అయ్యారు.

News March 19, 2025

సాలూరు: గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు

image

గిరిజనులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 15న తోణాం పంచాయతీ మద్దిన వలస గ్రామంలో పొలం గట్టు గొడవలో కోనేటి లక్ష్మణరావు ఆయన భార్య ఝాన్సీలపై దాడి చేసి దూషించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

error: Content is protected !!