News March 27, 2025
VKB జిల్లాలో నేటి TOP NEWS..!

❤ VKB:బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బసవరాజ్ పటేల్ ❤VKB: 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు:అదనపు కలెక్టర్ ❤రోడ్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన తాండూరు ఎమ్మెల్యే ❤మెరుగైన వైద్యం అందించాలి: పరిగి మాజీ ఎమ్మెల్యే ❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు ❤పరిగి:శ్రీ సత్య హరిచంద్ర వీధి నాటక ప్రదర్శన ❤మల్లికార్జున్ ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే.
Similar News
News April 1, 2025
విశాఖ వస్తున్న యుద్ధ నౌకలు

భారత్, అమెరికా సంయుక్తంగా విశాఖలో ఇవాళ్టి నుంచి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు చేయనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు ఈ విన్యాసాలు చేపడుతున్నాయి. 13 రోజుల పాటు బంగాళాఖాతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇరు దేశాల వైస్ అడ్మిరల్, రియల్ అడ్మిరల్ స్థాయిలో పరస్పర చర్చలు జరగనున్నాయి.
News April 1, 2025
ఆదిలాబాద్లో పెరిగిన చికెన్ ధరలు

పండగల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో చికెన్ విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతోపాటు చికెన్ ధరలు సైతం పెరిగాయి. ఆదిలాబాద్ పట్టణంలో కిలో రూ:200, స్కిన్ లెస్ రూ:220 ధర పలుకుతుంది. కొన్నిచోట్ల డిమాండ్ ను బట్టి అమ్ముతున్నారు. గత నెలలో కిలో రూ.160 నుంచి 180 వరకు విక్రయాలు జరిపారు. గత రెండు నెలలుగా గిరాకి లేక ఇబ్బందులు పడ్డ వ్యాపారులకు.. తిరిగి చికెన్ విక్రయాలు ఊపందుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News April 1, 2025
హైదరాబాద్లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్

TG: హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో జర్మనీ దేశానికి చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. లిఫ్ట్ ఇస్తామని ఆమెను కారులో ఎక్కించుకున్న దుండగులు మార్గంమధ్యలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.