News March 28, 2025
VKD: ఇంటి వద్దకే తలంబ్రాలు.. ఫోన్ చేయండి

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు పంపిస్తామని వికారాబాద్ డిపో మేనేజర్ గడ్డం అరుణ అన్నారు. భక్తులు కేవలం రూ.151 చెల్లించి, సమీపంలోని కార్గో కార్యాలయంలో ఏప్రిల్ 6లోగా బుకింగ్ చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వికారాబాద్ డిపో-91542 98740, చేవెళ్ల డిపో-91775 67300, తొరమామిడి-77995 20031 నంబర్లకు సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 23, 2026
జగిత్యాల: సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాలని కలెక్టర్ ఆదేశం

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. డీఆర్ఎస్సీ సమావేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, సైన్ బోర్డుల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్హెచ్-63, ఎన్హెచ్-563 రహదారులపై సమస్యాత్మక ప్రాంతాలను తక్షణం పరిష్కరించాలని సూచించారు.
News February 23, 2026
పుష్కరాల కోసం పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

రానున్న గోదావరి పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ నిర్వహించిన వీసీలో ఆమె మాట్లాడారు. బాసరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా పుష్కర ఘాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వసతులు కల్పిస్తామన్నారు. వీసీలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News February 23, 2026
ఇంటర్ పరీక్షలపై పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష

ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సమీకృత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. మొత్తం 22 కేంద్రాలలో 10367 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా చెక్ చేయాలని సూచించారు.


