News March 28, 2025

VKD: ఇంటి వద్దకే తలంబ్రాలు.. ఫోన్ చేయండి

image

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు పంపిస్తామని వికారాబాద్ డిపో మేనేజర్ గడ్డం అరుణ అన్నారు. భక్తులు కేవలం రూ.151 చెల్లించి, సమీపంలోని కార్గో కార్యాలయంలో ఏప్రిల్ 6లోగా బుకింగ్ చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వికారాబాద్ డిపో-91542 98740, చేవెళ్ల డిపో-91775 67300, తొరమామిడి-77995 20031 నంబర్లకు సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News December 9, 2025

బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

image

ఆర్‌కే బీచ్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్‌ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్‌ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

News December 9, 2025

స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

image

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

News December 9, 2025

భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు.. ఇద్దరు సస్పెన్షన్

image

<<18509437>>భద్రకాళి ఆలయంలో నకిలీ టికెట్లు<<>> అని Way2Newsలో వచ్చిన కథనంపై ఈవో సునీత స్పందించారు.ఈ మేరకు ఆలయ బుకింగ్ కౌంటర్‌లో పని చేస్తున్న శరత్, నరేందర్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం అర్చకులు, సిబ్బందితో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు.పూజ కార్యక్రమాల అనంతరం భక్తులకు నచ్చితే తోచిన సంభావణ మాత్రమే ఇవ్వాలని, ఎవరైనా డిమాండ్ చేస్తే దేవస్థాన కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు.