News March 28, 2025
VKD: ఇంటి వద్దకే తలంబ్రాలు.. ఫోన్ చేయండి

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు పంపిస్తామని వికారాబాద్ డిపో మేనేజర్ గడ్డం అరుణ అన్నారు. భక్తులు కేవలం రూ.151 చెల్లించి, సమీపంలోని కార్గో కార్యాలయంలో ఏప్రిల్ 6లోగా బుకింగ్ చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వికారాబాద్ డిపో-91542 98740, చేవెళ్ల డిపో-91775 67300, తొరమామిడి-77995 20031 నంబర్లకు సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 6, 2025
ప్రభుత్వ స్కూళ్లలో 2,837 ఉద్యోగాలు!

తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు) నియమించనున్నారు. విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
News November 6, 2025
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: డీఎంహెచ్వో

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో మహబూబాబాద్ జిల్లాను అగ్రభాగాన నిలపాలని డీఎంహెచ్వో డాక్టర్ బి. రవి రాథోడ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. మాతా శిశు సంరక్షణ, క్షయ వ్యాధి నియంత్రణ వంటి కీలక అంశాలపై వైద్యాధికారులు, నర్సింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్ సిబ్బందితో డీఎంహెచ్వో సమీక్షించారు.
News November 6, 2025
బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ

పాచిపెంట మండలం పి.కొనవలస ఆంధ్రా- ఒడిశా ఘాట్ రోడ్డులో ఒడిశా ఆర్టీసి బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి మాధవ్ రెడ్డి పర్యటించారు. గురువారం సాలూరు టౌన్ సీఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైవర్, ప్రయాణికులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందనేది కారణాలు తెలుసుకున్నారు.


