News November 17, 2025
VMLD: కనువిందు చేస్తున్న ఆలయ పార్కింగ్ స్థలం (వీడియో)

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ పార్కింగ్ స్థలం వాహనాలతో కనువిందు చేస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో రావడంతో రద్దీ వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయ పార్కింగ్ స్థలం భారీ వాహనాలతో స్పెషల్ అట్రాక్షన్గా దర్శనమిస్తోంది. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా రాజన్నను దర్శించుకుంటున్న భక్తులు, కోడె మొక్కులను భీమన్న ఆలయంలో చెల్లించుకునేందుకు బారులు తీరారు.
Similar News
News November 17, 2025
ఢిల్లీ బ్లాస్ట్లో 15మంది మృతి: పోలీసులు

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో NIA, ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు మృతుల సంఖ్యపై కూడా ఓ స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఈ పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించాడన్న అనుమానంతో కశ్మీరుకు చెందిన అమీర్ రషీద్ అలీని నిన్న NIA <<18306148>>అరెస్టు <<>>చేసిన విషయం తెలిసిందే. అతడిని కశ్మీర్కు తీసుకెళ్లి తదుపరి విచారణ కొనసాగించనుంది.
News November 17, 2025
ఢిల్లీ బ్లాస్ట్లో 15మంది మృతి: పోలీసులు

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో NIA, ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు మృతుల సంఖ్యపై కూడా ఓ స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఈ పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించాడన్న అనుమానంతో కశ్మీరుకు చెందిన అమీర్ రషీద్ అలీని నిన్న NIA <<18306148>>అరెస్టు <<>>చేసిన విషయం తెలిసిందే. అతడిని కశ్మీర్కు తీసుకెళ్లి తదుపరి విచారణ కొనసాగించనుంది.
News November 17, 2025
ప్రజావాణి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి: ములుగు కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులకు ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన గ్రీవెన్స్లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు ఉన్నారు.


