News January 12, 2025
VMWD: ఏ పుణ్యక్షేత్రానికి పోవాలన్న రాజన్నను దర్శించుకోవాల్సిందే!

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి ఒక ఆనవాయితీ ఉంది. ఏ పుణ్యక్షేత్రానికి పోవాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజలు ముందుగా రాజన్నను దర్శించుకుంటారు. కోడెను తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, రాజన్నను దర్శించుకోవడం వల్ల తమ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుందని భక్తుల నమ్మకం.
Similar News
News April 25, 2025
కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.
News April 25, 2025
కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.
News April 25, 2025
జగిత్యాల: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన JGTL పట్టణంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. JGTL(D) పోచమ్మ వాడకు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రసన్నలక్ష్మి(28), వెల్గటూర్(M)రాంనుర్కు చెందిన గాంధారి తిరుపతికి 2023లో వివాహమైంది. వీరికి సంవత్సరం బాబు ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె గురువారం ఇంట్లో ‘సారీ నాన్న.. నాకు బతకాలని లేదు’ అని అద్దంపై రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.