News August 27, 2024
31 నుంచి ‘వాలంటీర్ల నివేదన’ కార్యక్రమం

AP: మూడు నెలల బకాయిలు ఇవ్వాలని ₹10,000 జీతం హామీని వెంటనే అమలు చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన లక్ష మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలంది. లేదంటే CM చంద్రబాబు, Dy.CM పవన్కు తమ ఆవేదన తెలిసేలా ఈ నెల 31 నుంచి వాలంటీర్ల నివేదన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది.
Similar News
News January 28, 2026
అపార్ట్మెంట్ బాల్కనీలో మొక్కలు పెంచుతున్నారా?

అపార్ట్మెంట్ బాల్కనీలో పెంచే మొక్కలు ఇంటి అందంతో పాటు వాస్తు శ్రేయస్సును కూడా పెంచుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరిస్తున్నారు. తులసి, బిల్వం, పసుపు, సువాసనలు వెదజల్లే గులాబీ, మల్లె, జాజి మొక్కలు నాటాలంటున్నారు. ‘ఇవి ఆరోగ్యానికి, మనశ్శాంతికి ఎంతో మేలు చేస్తాయి. మనీప్లాంట్, తమలపాకు తీగలను కింది నుంచి పైకి పాకేలా చేస్తే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 28, 2026
RTCలో 40 కోట్ల మంది ఉచిత ప్రయాణం: రాంప్రసాద్ రెడ్డి

AP: ‘స్త్రీ శక్తి’లో ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు, ట్రాన్స్జెండర్లకు ఎంతో మేలు చేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ‘వారి జీవితాల్లో ఇదో గొప్ప మార్పు. ఇప్పటివరకు వారు 40 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. మహిళా ప్రయాణికులు 40% నుంచి 63.4%కి పెరిగారు. డిమాండ్కు అనుగుణంగా 1,413 అదనపు ట్రిప్పులు, 64,647 అదనపు KM ఆపరేట్ చేస్తున్నాం. సబ్సిడీగా RTCకి ₹1,388 కోట్లు ఇచ్చాం’ అని చెప్పారు.
News January 28, 2026
అజిత్ మరణం వెనుక కుట్ర లేదు: శరద్ పవార్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ఎన్సీపీ అధినేత, ఆయన పెద్దనాన్న శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని సూచించారు. ఇది పూర్తిగా ఓ యాక్సిడెంట్ అని పేర్కొన్నారు. కాగా అజిత్ మరణంలో కుట్ర కోణం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


