News March 16, 2024

వాలంటీర్లు దూరంగా ఉండాల్సిందే: సీఈసీ

image

AP: ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాల్సిందేనని సీఈసీ రాజీవ్ కుమార్ తేల్చిచెప్పారు. వారితో పాటు కాంట్రాక్టు సిబ్బంది కూడా ఎన్నికల విధులు నిర్వర్తించరాదని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ కూడా అదే విషయాన్ని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల్లో ఒకరిని మాత్రం ఎన్నికల విధుల్లో వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇంకు వేసేందుకు మాత్రమే వారిని వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News December 3, 2025

ఈ విషయం మీకు తెలుసా?

image

చెప్పులు, బూట్లు కొనేటప్పుడు చాలా మంది పొడవు నంబర్‌ను మాత్రమే చూస్తారు. అయితే షూలకు పొడవుతో పాటు వెడల్పును సూచించే ప్రత్యేక నంబర్లు (ఉదాహరణకు, B,AA, EE) కూడా ఉంటాయి. ఇది తెలియక కొందరు కొత్తవి ఇరుకుగానే ఉంటాయని భావించి మౌనంగా నొప్పిని భరిస్తుంటారు. దీనివల్ల పాదాలు, అరికాళ్ల నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇకనుంచి షూ కొనే సమయంలో Width, Length చూడాలంటున్నారు. దీనికోసం పైనున్న ఫొటో చూడండి.

News December 3, 2025

మీ బ్రెయిన్ ఏ గేర్ వేసింది..?

image

మన మెదడు 9, 32, 66, 83 వయస్సుల్లో లెవల్ షిఫ్ట్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 0-9yrs: పరిసరాలు తెలుసుకోవడం. 9-32: పరిపక్వత దిశగా ప్రయాణం, భావోద్వేగాలు, పనితీరు, ఆలోచన శక్తి పెరుగుతాయి. గ్రాఫ్ వేస్తే.. 32Yrs పీక్ పర్ఫార్మెన్స్. 32-66: సెటిల్డ్, లిమిటేషన్స్ మెంటాల్టి. ప్రిడిక్టబుల్ థాట్స్. 66-83: మతిమరుపు, అనారోగ్యం, రిజర్వ్డ్ అవుతారు. 83- కొన్ని పనులు, ఆలోచనలే చేయగలరు.

News December 3, 2025

ఇతిహాసాలు క్విజ్ – 85 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
సమాధానం: పాండురాజు వేటకు వెళ్లినప్పుడు, జింకలుగా భావించి కిందమ అనే మహామునిపై బాణం వేస్తాడు. దీంతో ఆ ముని మరణిస్తూ పాండురాజు తన భార్యతో కలిసిన తక్షణమే మరణిస్తాడని శపిస్తాడు. ఈ శాపం కారణంగా, ఒకరోజు మాద్రితో కలిసినప్పుడు పాండురాజు తక్షణమే మరణించారు. దాంతో మాద్రి సహగమనం చేసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>