News April 7, 2024

అభివృద్ధికి ఓటేస్తారా? విధ్వంసానికి వేస్తారా?: చంద్రబాబు

image

AP: అభివృద్ధికి ఓటు వేస్తారా? విధ్వంసానికి వేస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. ‘ఈ ఐదేళ్లలో వైసీపీ అరాచకాలు తప్ప ఏమీ చేయలేదు. సంక్షేమానికి ఓటు వేస్తారా? సంక్షోభం సృష్టించిన వైసీపీకి వేస్తారా? వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారు. జగన్ 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు’ అని పామర్రులో టీడీపీ ప్రజాగళం సభలో బాబు ఆరోపించారు.

Similar News

News January 24, 2026

బాపట్ల జిల్లా ప్రయాణికులకు గుడ్ న్యూస్.!

image

ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన తిరువనంతపురం–చర్లపల్లి <<18930504>>అమృత్ భారత్<<>> ప్రత్యేక రైలు శనివారం బాపట్ల స్టేషన్‌కు రానుంది. ఉదయం 10.20 గంటలకు గుంటూరు, అనంతరం బాపట్లకు రానుంది. ఈ మార్గంలో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు గుంటూరు స్టేషన్‌లో ఘన స్వాగతం పలకాలని రైల్వే వినియోగదారుల సంఘాలు నిర్ణయించాయి. ప్రయాణికులకు కొత్త కనెక్టివిటీ అందనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News January 24, 2026

BCB కంప్లైంట్.. తిరస్కరించిన DRC

image

భారత్‌లో T20 WC ఆడేది లేదని తేల్చి చెప్పిన BCB నిన్న ICC వివాద పరిష్కార కమిటీ(DRC)ని ఆశ్రయించింది. INDలో ఆడాల్సిందే అన్న ICC నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని కోరింది. అయితే నిబంధనల ప్రకారం ICC నిర్ణయంలో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని DRC చెప్పింది. అటు BCB మంకు పట్టు వీడని నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేయడంపై ఇవాళ ICC తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్సుంది.

News January 24, 2026

ESIC రాంచీలో 82 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ESIC <<>>రాంచీ 82 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 69ఏళ్లు కాగా.. సీనియర్ రెసిడెంట్‌కు 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి మొదటివారంలో ఇంటర్వ్యూ ఉంటుంది. వెబ్‌సైట్: https://esic.gov.in