News May 25, 2024
ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

దేశంలో 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూఢిల్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఢిల్లీలో ఓటేశారు. ఝార్ఖండ్లోని రాంచీలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్, భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News October 15, 2025
పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం

AP: అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను CM చంద్రబాబు సచివాలయంలో పరిశీలించారు. విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం చేశారు. శాఖమూరులో 6.8 ఎకరాల్లో మెమోరియల్ ట్రస్ట్, స్మృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో విగ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
News October 15, 2025
అఫ్గాన్ ప్లేయర్లకు టాప్ ర్యాంకులు

ICC ర్యాంకింగ్స్లో అఫ్గానిస్థాన్ ప్లేయర్లు సత్తా చాటారు.
*వన్డే బౌలర్లలో రషీద్ ఖాన్కు నం.1 ర్యాంక్
*వన్డే ఆల్రౌండర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్కు నం.1 ర్యాంక్
*వన్డే బ్యాటర్లలో ఇబ్రహీం జర్దాన్కు రెండో ర్యాంక్
> మరోవైపు భారత ప్లేయర్లు కూడా ర్యాంకింగ్స్ దక్కించుకున్నారు. టెస్టు బౌలర్లలో బుమ్రా, టీ20 బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వన్డే బ్యాటర్లలో గిల్, టీ20 బ్యాటర్లలో అభిషేక్ నం.1 ర్యాంకుల్లో ఉన్నారు.
News October 15, 2025
స్పామ్ కాల్స్ రావొద్దంటే ఇలా చేయండి!

గత కొన్నేళ్లుగా స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. లోన్లు, క్రెడిట్ కార్డులు ఇస్తాం అంటూ పదేపదే కాల్స్ చేస్తూ విసిగిస్తున్నారు. అలాంటి కాల్స్ రాకుండా ఉండేందుకు ఇప్పటికే ట్రాయ్ DND (Do Not Disturb) అనే విధానం తీసుకొచ్చింది. 1909 నంబర్కు కాల్ లేదా SMS చేసి టెలిమార్కెటింగ్ కాల్స్ రాకుండా బ్లాక్ చేయవచ్చు. లేదా DND యాప్ నుంచి నేరుగా టెలి కమ్యూనికేషన్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.
Share it