News March 23, 2024

26లోపు ఓటర్ల దరఖాస్తులను పరిష్కరించాలి: సీఈవో

image

AP: ఓటర్ల జాబితాలో మార్పుల కోసం సమర్పించిన ఫాం-7, ఫాం-8 దరఖాస్తులను ఈ నెల 26లోపు పరిష్కరించాలని అధికారులను సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఫాం-6లను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల పరిధిలోనే కాకుండా రాష్ట్రాల సరిహద్దుల్లోనూ నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రతి తనిఖీ కేంద్రం వద్ద ఒక కెమెరాతో స్టాటిక్ సర్వెలెన్స్ బృందాన్ని ఉంచాలన్నారు.

Similar News

News November 14, 2025

తేజస్వీ విజయం.. తేజ్ ప్రతాప్ పరాజయం

image

బిహార్ ఎన్నికల్లో మహా కూటమి CM అభ్యర్థి, RJD నేత తేజస్వీ యాదవ్ గెలిచారు. రాఘోపూర్ నియోజకవర్గంలో BJP నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మరోవైపు మహువా నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్(-51,938 ఓట్లు) మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. రామ్‌విలాస్ అభ్యర్థి సంజయ్ కుమార్ సింఘ్ 44 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రెండో స్థానంలో RJD అభ్యర్థి ముకేశ్ కుమార్ నిలిచారు.

News November 14, 2025

CII: 2 రోజుల్లోనే ₹7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

image

AP: విశాఖలో నిర్వహిస్తున్న CII సదస్సు మంచి ఫలితాలిస్తోంది. నిన్న, ఇవాళ కలిపి ₹7,14,780 CR పెట్టుబడులపై 75 MOUలు జరిగాయి. వీటి ద్వారా 5,42,361 ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
* తొలి రోజు సదస్సులో మొత్తంగా 40 కంపెనీలతో ₹3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. వీటి ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం.
* నిన్న 35 ఒప్పందాల ద్వారా ₹3,65,304 కోట్ల పెట్టుబడులు. వీటితో 1,26,471 ఉద్యోగాలు.

News November 14, 2025

బిహార్ ప్రజలు రికార్డులు బద్దలుకొట్టారు: మోదీ

image

బిహార్ ప్రజలు వికసిత్ భారత్ కోసం ఓటేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘బిహార్‌లో NDA సాధించింది అతి పెద్ద విజయం. రికార్డుస్థాయిలో ఎన్నికల్లో పాల్గొనాలని నేను ఓటర్లను కోరాను. వాళ్లు రికార్డులు బద్దలుకొట్టారు. మేం ప్రజలకు సేవకులం. వారి మనసులు గెలుచుకున్నాం. బిహార్‌లో ఆటవిక రాజ్యం ఎప్పటికీ తిరిగిరాదు. కొందరు MY ఫార్ములాతో గెలవాలని చూశారు. మా ‘MY’ ఫార్ములా అంటే మహిళ, యూత్ ఫార్ములా’ అని తెలిపారు.