News March 23, 2024

26లోపు ఓటర్ల దరఖాస్తులను పరిష్కరించాలి: సీఈవో

image

AP: ఓటర్ల జాబితాలో మార్పుల కోసం సమర్పించిన ఫాం-7, ఫాం-8 దరఖాస్తులను ఈ నెల 26లోపు పరిష్కరించాలని అధికారులను సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఫాం-6లను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల పరిధిలోనే కాకుండా రాష్ట్రాల సరిహద్దుల్లోనూ నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రతి తనిఖీ కేంద్రం వద్ద ఒక కెమెరాతో స్టాటిక్ సర్వెలెన్స్ బృందాన్ని ఉంచాలన్నారు.

Similar News

News November 18, 2025

మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

image

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.

News November 18, 2025

మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

image

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.

News November 18, 2025

ప్రభుత్వంపై విమర్శలు.. 65 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

image

వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్కడి కోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా వాట్సాప్ ఆడియో మెసేజ్‌లో నికోలస్‌ను విమర్శించిన మార్గీ ఒరోజ్కో అనే 65 ఏళ్ల వైద్యురాలికి ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెపై రాజద్రోహం, ద్వేషాన్ని ప్రేరేపించారనే నిందలు మోపింది. కాగా ప్రస్తుతం వెనిజులాలో 882 మంది రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ NGO వెల్లడించింది.