News May 20, 2024

బారులు తీరిన ఓటర్లు

image

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్‌లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

Similar News

News February 1, 2026

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలో 50% కట్!

image

సరికొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని FM నిర్మలా సీతారామన్ తెలిపారు. సంస్కరించిన ఈ నియమావళిని రికార్డు టైమ్‌లో పూర్తిచేసినట్టు వెల్లడించారు. సింప్లిఫై చేసిన రూల్స్, ఫామ్స్‌ను త్వరలోనే నోటిఫై చేస్తామన్నారు. వీటికి అలవాటు పడేందుకు ట్యాక్స్ పేయర్లకు సరిపడా టైమ్ ఇస్తామని చెప్పారు. కొత్త చట్టంలో పన్ను రేట్లలో మార్పులుండవని, 50% సెక్షన్లు తొలగించినట్టు వివరించారు.

News February 1, 2026

Budget 2026: ఏ రంగానికి ఎంతంటే..

image

కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. కీలక రంగాలకు కేటాయింపులు ఇలా (కోట్లలో)…* ట్రాన్స్‌పోర్ట్ – ₹5,98,520 * రక్షణ రంగం – ₹5,94,585 * గ్రామీణాభివృద్ధి – ₹2,73,108 * హోంశాఖ – ₹2,55,234 * వ్యవసాయం – ₹1,62,671 * విద్య – ₹1,39,289 * వైద్యారోగ్యం – ₹1,04,599 * పట్టణాభివృద్ధి – ₹85,522 * IT, టెలికం – ₹74,560 * వాణిజ్యం, పరిశ్రమలు – ₹70,296

News February 1, 2026

ఏపీ సహా 4 రాష్ట్రాలతో మైనింగ్ మిషన్

image

ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో స్పెషల్ మైనింగ్ మిషన్ ఏర్పాటుచేస్తామన్నారు. ప్రపంచ స్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని పేర్కొన్నారు. కాగా రేర్ ఎర్త్ మినరల్స్ జాబితాలో మోనాజైట్, జెనోటైమ్, బాస్ట్‌నేసైట్, లోపరైట్ ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్ రంగానికి కీలకం.