News May 20, 2024

బారులు తీరిన ఓటర్లు

image

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్‌లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

Similar News

News February 22, 2026

పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక

image

తమ వివాహాన్ని విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు ప్రకటించారు. ఈ మేరకు ఇరువురూ ఒకే తరహా పోస్టును ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘మేం ఏదైనా ప్లాన్ చేయడానికి ముందే మీరు చాలా ప్రేమతో మాకు ఓ పేరు పెట్టారు. మమ్నల్ని VIROSH అని పిలిచారు. మీ ఇష్ట ప్రకారమే మా వేడుకకు The Wedding of VIROSH అని పేరు పెట్టాలనుకుంటున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈనెల 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.

News February 22, 2026

ట్రంప్ రిసార్ట్‌లోకి అగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ

image

US అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించేందుకు యత్నించడం కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని కాల్చి చంపారు. లొంగిపోవాలని సూచించగా అతను గన్ పైకెత్తడంతో కాల్పులు జరిపి అంతమొందించారు. ఘటన జరిగినప్పుడు ట్రంప్ వాషింగ్టన్‌లో ఉన్నారు. సముద్రతీరంలో నిర్మించిన ఈ రిసార్టును ట్రంప్ 1985లో కొనుగోలు చేశారు. దీన్ని వింటర్ వైట్‌హౌస్ అని పిలుస్తారు.

News February 22, 2026

టీమ్ఇండియా 5 వికెట్లు డౌన్

image

T20WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలుత ఓపెనర్ కిషాన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ అభిషేక్ 15 పరుగులకే వెనుదిరిగారు. తిలక్ వర్మ(1), సుందర్(11) సైతం రాణించలేదు. ఆపై నిలకడగా ఆడుతున్న కెప్టెన్ సూర్య(18) 10వ ఓవర్లో ఔట్ అయ్యారు.