News May 20, 2024

బారులు తీరిన ఓటర్లు

image

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్‌లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

Similar News

News February 14, 2026

T20WC నుంచి ఒమన్ ఔట్

image

ఇవాళ ఐర్లాండ్‌ చేతిలో ఓటమితో T20WC-2026 నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ఒమన్ నిలిచింది. గ్రూప్-Bలో ఉన్న ఆ జట్టు లీగ్ దశలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే గ్రూపులో శ్రీలంక, జింబాబ్వే ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలతో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అటు లీగ్ దశలో ఒమన్ తన చివరి మ్యాచ్‌ను FEB 20న ఆస్ట్రేలియాతో ఆడనుంది.

News February 14, 2026

AP వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం: అచ్చెన్న

image

భారత వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతంగా ఉందని, వ్యవసాయ రంగంలో AP 7.83% వృద్ధి రేటు సాధించిందని మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరిపి రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ-PM కిసాన్ కింద 2025-26లో రూ.6,309 కోట్లు చెల్లించామని.. 2026-27లో దానిని రూ.6,600 కోట్లకు పెంచామన్నారు.

News February 14, 2026

బంగినపల్లి మామిడి@ టన్ను రూ.1.75 లక్షలు

image

AP: మామిడి పండ్లకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. తోతాపురి టన్ను ధర ₹1.10 లక్షలకు చేరగా, బంగినపల్లి మామిడి(కవర్లు కట్టి సాగు చేసినవి)కి ₹1.75 లక్షల రేటు పలికింది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గతంతో పోలిస్తే ఈ రేటు ₹50వేలు ఎక్కువ కావడం విశేషం. కాయల నాణ్యత తగ్గకుండా ఉండేందుకు వాటికి కవర్లను(ఒక్కో కవర్ ₹2) కడుతుంటారు. వీటికి ప్రభుత్వం 50% సబ్సిడీ కూడా ఇస్తుంది.