News May 20, 2024

బారులు తీరిన ఓటర్లు

image

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్‌లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

Similar News

News February 6, 2026

మాకు పాఠాలు చెప్పొద్దు.. ట్రంప్‌కు ‘నోబెల్’ ప్రతిపాదనపై పోలండ్

image

ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలని US పంపిన ప్రతిపాదనలను పోలండ్ తిరస్కరించింది. అవార్డుకు ఆయన అర్హుడు కాదని పార్లమెంట్ స్పీకర్ జాజెస్టీ ప్రకటించారు. దీంతో ఇది ట్రంప్‌ను అవమానించడమేనని US దౌత్యవేత్త టామ్ రోజ్ విమర్శించారు. దీనికి పోలండ్ PM టస్క్ కౌంటరిచ్చారు. ‘అంబాసిడర్ రోజ్ మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేకానీ పాఠాలు చెప్పొద్దు. దౌత్యం ఎలా నిర్వహించాలో మాకు తెలుసు’ అని పేర్కొన్నారు.

News February 6, 2026

ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు ‘సుశ్రుతుడు’

image

శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుడు. క్రీ.పూ.4వ శతాబ్దానికి చెందిన ఆయన కాశీలో ధన్వంతరి వద్ద వైద్యవిద్యను అభ్యసించారు. కొన్ని శతాబ్దాల క్రితమే ప్లాస్టిక్ సర్జరీ, సిజేరియన్, కంటి శుక్లాలు, మూత్రపిండాల రాళ్లను తొలగించే శస్త్రచికిత్సలు చేశారు. శస్త్రచికిత్స సమయంలో నొప్పి తెలియకుండా మత్తుమందుగా ద్రాక్షరసాన్ని వాడారు. ఆయన రచించిన సుశ్రుత సంహితలో 101 రకాల శస్త్రచికిత్స పరికరాల గురించి వివరించారు.

News February 6, 2026

ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

image

థైరాయిడ్ గ్రంథి పనితీరుకు, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ ఎంతో ముఖ్యం. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే గర్భస్రావం, వికలాంగ శిశువు, మరుగుజ్జు, చెవి, కంటి సమస్యలు, నత్తి, మానసిక, ఎదుగుదల లోపాలు వంటివి కనిపిస్తాయంటున్నారు నిపుణులు. పాలు, ఎండుద్రాక్ష, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.