News May 20, 2024
బారులు తీరిన ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Similar News
News February 7, 2026
T20 WC.. నేటి మ్యాచ్కు బుమ్రా దూరం!

T20 WCలో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాతో జరిగే <<19072262>>తొలి మ్యాచ్<<>>కు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరల్ జ్వరం కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. నిన్న ఆయన గ్రౌండ్కు వచ్చినా ప్రాక్టీస్ చేయలేదు. మరోవైపు సుందర్ ఇంకా ఫిట్ కాకపోవడంతో భారత స్క్వాడ్లో 13 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ మ్యాచ్లో సిరాజ్ ఆడే అవకాశం ఉంది.
News February 7, 2026
‘వందేభారత్’లో పేలుళ్లకు ప్లాన్.. కలకలం రేపిన లేఖ

TG: వందే భారత్ రైళ్లను పేల్చేందుకు కుట్ర జరుగుతోందంటూ ఓ ఆగంతకుడు రైల్వే అధికారులకు లేఖ రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. HYDలో ఉంటున్న నలుగురు జిహాదీలు వందేభారత్ ట్రైన్స్లో దాడులకు ప్లాన్ చేశారని అతను లేఖలో పేర్కొన్నాడు. దాదాపు 250 మందిని చంపాలని చూస్తున్నట్లు తెలిపాడు. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ లేఖపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 7, 2026
పాక్ యూటర్న్ తీసుకోవచ్చు: ఇర్ఫాన్ పఠాన్

T20 WCలో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19024958>>పాకిస్థాన్ నిర్ణయం<<>> మార్చుకోవచ్చని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. ‘టోర్నీ గ్రూప్ దశలో మనకు ఎలాంటి సవాళ్లు లేవు. ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ విషయంలో ఏ క్షణమైనా పాక్ యూటర్న్ తీసుకోవచ్చు. ఒకవేళ యూటర్న్ తీసుకుని ఆడినా.. మనకు పోటీ ఇవ్వలేదు. ఆసియా కప్లో వరుసగా మూడుసార్లు ఓడించాం. వారిపై ఇండియాదే డామినేషన్’ అని తన యూట్యూబ్ ఛానల్లో అన్నారు.


