News May 20, 2024

బారులు తీరిన ఓటర్లు

image

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్‌లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

Similar News

News February 9, 2026

చెవులు లేకున్నా వింటాయివి!

image

ప్రత్యేక శరీర ఆకృతి, కండరాల నిర్మాణంతో కొన్ని జీవులు బాహ్య చెవులు లేకున్నా వినగలుగుతాయి. పాములకు దవడ ఎముక ద్వారా లోపలి చెవికి సౌండ్ సిగ్నల్స్ అందుతాయి. సాలీడు కాళ్లపై ఉన్న వెంట్రుకలు వైబ్రేషన్స్ విని అపాయాన్ని పసిగడతాయి. సాలమండర్లు చర్మం, వాటి పుర్రె ఎముకలు.. బల్లుల అంతర్గత శరీరాకృతి వల్ల వినగలుగుతాయి. చాలా రకాల చేపలు సైతం అవి తిరిగే ప్రాంతంలో ప్రత్యేకమైన సిస్టమ్ ఏర్పరచుకొని సౌండ్స్ వింటాయి.

News February 9, 2026

దక్షిణ దిశలో ఇల్లు ఉండకూడదా?

image

దక్షిణానికి యముడు అధిపతి కావడంతో ఈ దిక్కున ఇల్లు కడితే అశుభమని చాలామంది భయపడతారు. అయితే ఇది అపోహ మాత్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దక్షిణాన ఉన్న స్థలం నివాసానికి పనికిరాదనేది నిజం కాదు. నిర్మాణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దిక్కున ఉన్నవాళ్లు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే యమస్థానం నుంచి కూడా మంచి ఫలితాలను పొందవచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 9, 2026

రోహిత్, కోహ్లీకి BCCI షాక్

image

సెంట్రల్ కాంట్రాక్ట్(2025-26) విషయంలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి BCCI షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు A+ కేటగిరీలో ఉన్న వారిద్దరినీ గ్రేడ్ Bలో చేర్చింది. రోకో టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అటు బుమ్రా, గిల్, జడేజాను మాత్రమే గ్రేడ్ Aలో ఉంచింది.