News May 20, 2024
బారులు తీరిన ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Similar News
News February 6, 2026
తొందరపడుతున్న బంగ్లాదేశ్.. వెల్లువెత్తుతున్న విమర్శలు

భారత్-US ట్రేడ్ డీల్ తర్వాత బంగ్లాదేశ్ కూడా అగ్రరాజ్యంతో ‘సీక్రెట్’ ఒప్పందం కోసం తొందరపడుతోంది. ఈ నెల 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 9వ తేదీన హడావుడిగా ఒప్పందంపై సైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రేడ్ డీల్ అంటే పలుమార్లు చర్చిస్తారు. అందులోని విషయాలను ప్రజలు, పారిశ్రామికవేత్తలతో పంచుకుంటారు. ఇవేవీ లేకుండా రహస్యంగా డీల్కు రెడీ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News February 6, 2026
కుప్పకూలిన బిట్కాయిన్ ధర

క్రిప్టో కరెన్సీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గత OCTలో రికార్డు స్థాయిలో $1,26,272కు చేరిన బిట్కాయిన్ ధర $60,033కు పడిపోయింది. క్రిప్టో ఫ్రెండ్లీగా పేరున్న ట్రంప్ US అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పెరుగుదల కనిపించినా క్రమంగా తిరోగమనం మొదలైంది. రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను షేక్ చేస్తుండటంతో రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. దీంతో పతనం ప్రారంభమైంది.
News February 6, 2026
50ఏళ్ల తర్వాత మహిళలు ఇవి తినాలి

ఆడవారిలో 50 సంవత్సరాలు దాటాక హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దీంతో శక్తి తగ్గడం, జాయింట్ పెయిన్స్, కండరాలు దృఢంగా మారడం, మానసిక సమస్యలొస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజూవారీ ఆహారంలో నువ్వులు, అవిసెగింజలు, బాదం పప్పులు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు ఎక్కువగా నీరు తాగడంతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం మంచిదంటున్నారు.


