News May 20, 2024

బారులు తీరిన ఓటర్లు

image

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్‌లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

Similar News

News January 24, 2026

BCB కంప్లైంట్.. తిరస్కరించిన DRC

image

భారత్‌లో T20 WC ఆడేది లేదని తేల్చి చెప్పిన BCB నిన్న ICC వివాద పరిష్కార కమిటీ(DRC)ని ఆశ్రయించింది. INDలో ఆడాల్సిందే అన్న ICC నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని కోరింది. అయితే నిబంధనల ప్రకారం ICC నిర్ణయంలో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని DRC చెప్పింది. అటు BCB మంకు పట్టు వీడని నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేయడంపై ఇవాళ ICC తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్సుంది.

News January 24, 2026

ESIC రాంచీలో 82 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ESIC <<>>రాంచీ 82 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 69ఏళ్లు కాగా.. సీనియర్ రెసిడెంట్‌కు 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి మొదటివారంలో ఇంటర్వ్యూ ఉంటుంది. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 24, 2026

‘సింకింగ్ ఫండ్’.. అప్పుల బాధ ఉండదిక!

image

పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు, చేబదుళ్లపై ఆధారపడకుండా ఉండాలంటే ‘సింకింగ్ ఫండ్’ ఉత్తమ మార్గం. ఏడాదికోసారి వచ్చే బీమా ప్రీమియంలు, పండుగ ఖర్చులు లేదా పిల్లల ఫీజుల కోసం ముందే నెలకు కొంత చొప్పున పక్కన పెట్టడమే ఈ ఫండ్ లక్ష్యం. అప్పు తీసుకుని వడ్డీ కట్టే బదులు మనమే వాయిదాల్లో డబ్బు దాచుకుంటే రివర్స్‌లో మనకే బ్యాంక్ నుంచి వడ్డీ వస్తుంది. RD లేదా లిక్విడ్ ఫండ్స్ వంటివి దీనికి బెస్ట్.