News May 20, 2024

బారులు తీరిన ఓటర్లు

image

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్‌లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

Similar News

News January 3, 2026

ఇవాళ సూపర్ మూన్.. ఎన్ని గంటలకంటే?

image

ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు. ఆ సమయంలో ఎర్త్‌కు 3.6 లక్షల KM దూరంలో చందమామ ఉంటాడట. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం, అదే టైమ్‌లో సూర్యుడికి భూమి దగ్గరగా ఉండటం, సూర్యుడికి చంద్రుడు పూర్తి ఎదురుగా రావడంతో సూపర్ మూన్ వెలిగిపోనుంది.

News January 3, 2026

కొడుకు, కోడలు క్యూట్ ఫొటో షేర్ చేసిన ప్రియాంకా గాంధీ

image

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ కొడుకు రైహాన్ త్వరలో <<18710916>>పెళ్లి<<>> చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడుకు, కాబోయే కోడలు క్యూట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. వారిద్దరూ మూడేళ్ల వయసు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘మీ ఇద్దరినీ ఎంతో ప్రేమిస్తున్నా. ఎల్లప్పుడూ ఒకరినొకరూ ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండండి. మూడేళ్ల వయసు నుంచీ ఉన్నట్లే ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగండి ’ అని రాసుకొచ్చారు.

News January 3, 2026

గ్రూపులు బువ్వ పెట్టవు.. కొత్త నేతలను గద్దల్లా పొడవొద్దు: ఈటల

image

TG: పార్టీలో చేరిన నేతలను గౌరవించి అక్కున చేర్చుకోవాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అంతేతప్ప కాకులు, గద్దల్లా పొడవొద్దని అన్నారు. ‘గ్రూపులు మంచివి కావు. అవి బువ్వ పెట్టవు. మనకు ఉన్న శక్తే తక్కువ. మళ్లీ ఇందులో గ్రూపులు అవసరమా? రాజకీయాల్లో విశాల హృదయంతో ఆలోచించాలి. శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు’ అని చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.