News May 20, 2024
బారులు తీరిన ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్లో ఉదయం 9 గంటలకు 10.28% శాతం పోలింగ్ నమోదైంది. బిహార్-8.86%, జమ్మూ కశ్మీర్-7.63%, ఝార్ఖండ్-11.68%, మహారాష్ట్ర-6.33%, లద్దాక్-10.51%, ఒడిశా-6.87%, పశ్చిమ బెంగాల్లో 15.35% మంది ఓటేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Similar News
News February 16, 2026
వీరు ఉపవాసం చెయ్యకూడదు

ఉపవాసం మంచిదే కొందరికి ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గుండె జబ్బులు, BP, కొరోనరీ ఆర్టరీ, అరిథ్మియా సమస్యలున్నవారు ఉపవాసం చేస్తే చక్కెర స్థాయిలు, ఎలక్ట్రోలైట్ సమతుల్యత, నీటి శాతం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బీటా బ్లాకర్స్, యాంటీ అరిథమిక్స్, బ్లడ్ థిన్నర్స్ మందులు వాడే వారు ఆహారంతో పాటు నిర్దిష్ట సమయంలో మందులను వేసుకోవాలి. కాబట్టి ఉపవాసానికి దూరంగా ఉండాలి.
News February 16, 2026
నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి AIIMS నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని AIIMS నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (NORCET 10)షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc(Hons.)నర్సింగ్, BSc(నర్సింగ్) , డిప్లొమా(GNM)అర్హత గలవారు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్స్) ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.3వేలు, SC, ST, EWSలకు రూ.2400. వెబ్సైట్: https://aiimsexams.ac.in
News February 16, 2026
ఉపవాసం తర్వాత ఇలా చేయండి

శివరాత్రికి కఠిన ఉపవాసం పాటించిన వారు నీరసంగా ఉంటారు. ఉపవాసం తర్వాత ఖాళీ కడుపుతో భారీగా ఫుడ్ తింటే అనారోగ్యానికి దారి తీయొచ్చు. మెత్తగా వండిన అన్నం, పప్పు, కూరగాయాలు, చిలగడదుంప, పెరుగన్నం వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. నూనె, ఉప్పు, కారం అధికంగా ఉన్న ఆహారాన్ని తినరాదు. వీటిని తీసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు.


