News June 14, 2024
ఈవీఎంలలో ఓటర్ల మ్యాజిక్ కనిపించింది: శరద్ పవార్

వచ్చే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని NCP-SP చీఫ్ శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘LS ఎన్నికల సమయంలో ప్రజలు మనసులో ఏముందో చెప్పలేదు. అయినా ఆందోళన చెందొద్దని, వారు EVMలో సరైన బటన్ నొక్కుతారని కార్యకర్తలకు చెప్పా. వాటిని తెరిచినప్పుడు ఓటర్లు చేసిన మ్యాజిక్ కనిపించింది’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో NCP-SP 8 సీట్లు గెలుచుకుంది.
Similar News
News September 13, 2025
వందకు పైగా రాఫెల్ జెట్ల కొనుగోలుకు IAF ప్రతిపాదన

మేడ్ ఇన్ ఇండియా కింద 114 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) డిఫెన్స్ మినిస్ట్రీకి ప్రతిపాదన సమర్పించింది. ఇది రక్షణ రంగంలో అతిపెద్ద డీల్(విలువ ₹2L Cr) అని తెలుస్తోంది. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్, ఇండియన్ కంపెనీలు వీటిని తయారు చేయనున్నాయి. వీటిలో 60% స్వదేశీ కంటెంట్ వాడనున్నారు. అటు డసాల్ట్ సంస్థ HYDలో మెయింటెనెన్స్ ఫెసిలిటీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
News September 13, 2025
‘రాజాసాబ్’ రిలీజ్ను అందుకే వాయిదా వేశాం: నిర్మాత

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ 80% పూర్తయినట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. నవంబర్ నెలాఖరు నాటికి సినిమా మొత్తం రెడీ అవుతుందన్నారు. సంక్రాంతి సీజన్ కోసమే డిసెంబర్ 5 నుంచి జనవరి 9వ తేదీకి రిలీజ్ను వాయిదా వేశామన్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో VFX వర్క్పై ప్రశంసలొస్తున్నాయి.
News September 13, 2025
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సూపర్ ఫైన్ రకం అంచనాలకు మించి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే రేషన్ బియ్యంలో నాణ్యత పెంచుతామని చెప్పారు.