News April 7, 2024

లబ్ధి పొంది ఇతరులకు ఓటేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లే: MLA

image

కర్ణాటక ఎమ్మెల్యే రాజు కాగే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘గ్యారంటీ స్కీం పొందిన వారు ఇతరులకు ఓటు వేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లే, ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోసినట్లే..’ అని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ పేదలు, రైతుల గురించి నోరు విప్పలేదని, బీజేపీకి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News October 21, 2025

అమెరికన్లకు ట్రంప్ దీపావళి విషెస్

image

ప్రపంచ దేశాధినేతలు సైతం హిందువులనుద్దేశించి దీపావళి విషెస్ చెబుతారు. అయితే US అధ్యక్షుడు ట్రంప్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి అమెరికన్‌కు విషెస్ తెలియజేశారు. ఈ పండుగ కుటుంబాలను, స్నేహితులను, కమ్యూనిటీలను ఏకం చేసి నమ్మకాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అయితే హిందువులు, ఇండియన్స్‌ను విష్ చేయకుండా ట్రంప్ బుద్ధి చూపిస్తున్నాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News October 21, 2025

అక్టోబర్ 21: చరిత్రలో ఈరోజు

image

1833: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జననం(ఫొటోలో-R)
1947: ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం
1967: అథ్లెట్ అశ్వినీ నాచప్ప జననం
1986: సినీ దర్శకుడు టి.కృష్ణ మరణం(ఫొటోలో-L)
1992: హీరోయిన్ శ్రీనిధి శెట్టి జననం
1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం
✦పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

News October 21, 2025

ఉద్యోగి ఆత్మహత్య.. వేధింపులపై ఫిర్యాదు చేయలేదు: ఓలా ప్రతినిధి

image

OLA ఉద్యోగి <<18058963>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై ఆ సంస్థ ప్రతినిధి స్పందించారు. అరవింద్ మూడున్నరేళ్లుగా తమ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారని, ఆ సమయంలో వేధింపుల గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అరవింద్ కుటుంబానికి తక్షణమే అండగా నిలిచేందుకు ఫైనల్ సెటిల్‌మెంట్ డబ్బులు బ్యాంకు అకౌంట్లో వేశామని స్పష్టతనిచ్చారు. CEO భవీశ్‌పై నమోదైన కేసును హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.