News April 7, 2024
లబ్ధి పొంది ఇతరులకు ఓటేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లే: MLA

కర్ణాటక ఎమ్మెల్యే రాజు కాగే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘గ్యారంటీ స్కీం పొందిన వారు ఇతరులకు ఓటు వేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లే, ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోసినట్లే..’ అని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ పేదలు, రైతుల గురించి నోరు విప్పలేదని, బీజేపీకి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News December 9, 2025
మొదటి విడత ప్రచారానికి తెర

TG: పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరపడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత ఫలితాలు వెలువడతాయి. మొదటి విడతలో 4,235 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 56,19,430 మంది ఓటు వేయనున్నారు. వీరి కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
News December 9, 2025
హనుమాన్ చాలీసా భావం – 33

తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై ||
హనుమంతుడు శ్రీరాముడి పరమభక్తుడు. అందుకే ఆంజనేయస్వామిని భజిస్తే రాముడిని చేరుకోనే మార్గం సుగగమవుతుందని పండితులు చెబుతారు. హనుమాన్ భజన ఫలితంగా జన్మ జన్మలలోని దుఃఖాలన్నీ పోతాయని భావిస్తారు. మారుతీ నామ పఠనం మనకు భయాలు, దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆత్మ స్థైర్యం, ధైర్యాన్ని పెంచుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 9, 2025
ECIపై అనుమానాలు దురదృష్టకరం: కాంగ్రెస్ MP

ECI తటస్థ వైఖరిపై అనుమానాలు దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి అన్నారు. CJI, లోక్సభలో LoP EC కమిటీలో ఉండేలా రిఫామ్స్ తేవాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల్లో SIR చేపట్టడానికి కారణాలను కేంద్రం రాసివ్వాలని డిమాండ్ చేశారు. ‘EVMలు మానిప్యులేట్ అవుతాయని నేను అనడం లేదు. ఆ ఛాన్స్ ఉందని ప్రజలు భావిస్తున్నారు. 100% VVPATలను మ్యాచ్ చేయాలి లేదా బ్యాలెట్ పేపర్లకు వెళ్లాలి’ అని చెప్పారు.


