News May 12, 2024
ఆ దేశంలో ఓటు వేయడం తప్పనిసరి!

బెల్జియంలోనే కాకుండా అర్జెంటీనాలోనూ పౌరులు ఓటు వేయడం తప్పనిసరి. అక్కడ 112 ఏళ్ల నుంచి ఈ చట్టం అమల్లో ఉంది. 18-70 ఏళ్ల వారు కచ్చితంగా పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ఉల్లంఘిస్తే అందుకు సరైన కారణాలు వెల్లడించాలి. లేదంటే 5-50 డాలర్ల ఫైన్ చెల్లించడం, మూడేళ్ల పాటు ప్రభుత్వ పదవుల్లో ఉండకుండా నిషేధం వంటి ఆంక్షలు ఉన్నాయి. అయితే పాలకుల నిర్లక్ష్యంతో ఈ నిబంధనలు అమలుకావడం లేదు.
Similar News
News November 24, 2025
మహిళల కోసం ఎన్నో పథకాలు: రేవంత్

TG: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని CM రేవంత్ కొడంగల్ సభలో తెలిపారు. ‘సన్నబియ్యం ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. సోలార్ ప్లాంట్స్ నిర్వహణ అప్పగించాం. శిల్పారామంలో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాం’ అని వివరించారు.
News November 24, 2025
UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News November 24, 2025
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.


