News December 17, 2024

జమిలి బిల్లు జేపీసీకి పంపడంపై ఓటింగ్

image

జమిలి బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది ఓటింగ్‌లో పాల్గొనగా 220 మంది సభ్యులు YES చెప్పారు. 149 మంది NO అని ఓటేశారు. పలువురు సభ్యులు స్లిప్పుల ద్వారా ఓటు వేశారు. స్పీకర్ క్రాస్ చెకింగ్‌కు అవకాశమిచ్చారు. కాగా మొత్తం 543 మంది సభ్యులున్న లోక్‌సభలో 369 మందే ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Similar News

News October 21, 2025

రోహిత్, జైస్వాల్, అభిషేక్.. గిల్‌కి జోడీ ఎవరు?

image

మరో రెండేళ్ల(2027)లో మెన్స్ వన్డే CWC రానుంది. ఇప్పటి నుంచే ఆ టోర్నీలో ఓపెనింగ్ జోడీపై SMలో చర్చ మొదలైంది. T20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేలకే పరిమితమయ్యారు. అప్పటివరకు ఆయన కొనసాగుతారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే జైస్వాల్-గిల్ జోడీ అయితే బెటరని కొందరు, అభిషేక్-గిల్ అని మరికొందరు, రోహిత్-గిల్ బెస్ట్ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఏ జోడీ అయితే బెటర్? COMMENT

News October 21, 2025

పని ప్రదేశాల్లో వేధింపులకు చెక్ పెట్టే షీ బాక్స్

image

పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు షీబాక్స్ పేరిట కేంద్రం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. పనిప్రదేశాల్లో వేదింపులు ఎదుర్కొన్న మహిళలు షీబాక్స్ వెబ్‌సైట్లో ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీతో ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. అది అందిన వెంటనే సంబందిత విచారణ విభాగానికి బదిలీ అవుతుంది. బాధిత మహిళల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతారు. వెబ్‌సైట్:<>https://shebax.wcd.gov.in/<<>>

News October 21, 2025

బీజేపీ-ఆప్ మధ్య ‘పొల్యూషన్’ పంచాయితీ

image

ఢిల్లీలో పొల్యూషన్ సమస్య బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీపావళి వేళ కాలుష్యాన్ని నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని ఆప్ రాష్ట్రాధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దీంతో ఆ పార్టీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పంటల కాల్చివేత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడింది. పొల్యూషన్‌కు దీపావళిని బ్లేమ్ చేయొద్దని హితవు పలికింది.