News December 1, 2024
రాష్ట్రంలో మళ్లీ VRO వ్యవస్థ?

TG: రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన VROలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది VROలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. 10,909 రెవెన్యూ గ్రామాలకు VROలను నియమిస్తారని తెలుస్తోంది.
Similar News
News December 26, 2025
శిల్పాశెట్టి అసభ్యకర వీడియోలు.. వెంటనే తొలగించాలన్న కోర్టు

AI ఉపయోగించి తయారుచేసిన నటి శిల్పాశెట్టి డీప్ఫేక్ వీడియోల URLs, లింక్స్, పోస్టులను వెంటనే డిలీట్ చేయాలని సంబంధిత సైట్లను బాంబే HC ఆదేశించింది. ఆన్లైన్లో ఉన్న తన అసభ్యకర ఫొటోలు, వీడియోలను తొలగించాలని శిల్ప వేసిన పిటిషన్ను జస్టిస్ అద్వైత్ ఎం సేథ్నా వెకేషన్ బెంచ్ విచారించింది. ప్రాథమిక గోప్యత హక్కును ప్రభావితం చేసేలా ఒక వ్యక్తి/వ్యక్తిత్వాన్ని చిత్రీకరించకూడదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.
News December 26, 2025
AI డిమాండ్కు AP సిద్ధంగా ఉంది: లోకేశ్

భారత ఉద్యోగులు AI టూల్స్ను అడాప్ట్ చేసుకోవడంలో అన్ని దేశాలను దాటేశారన్న వార్తపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘AI అడాప్షన్లో భారత్ దూసుకుపోవడం యాదృచ్ఛికం కాదు. గవర్నెన్స్, ఫిన్టెక్, హెల్త్, మొబిలిటీ వంటి అంశాల్లో వినియోగ స్థాయిని ఇది ప్రతిబింబిస్తోంది. ఈ డిమాండ్ AI హబ్స్, డేటా సెంటర్స్ ఏర్పాటుకు తోడ్పడనుంది. AI రెడీ DC ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, ల్యాండ్తో AP సిద్ధం’ అని ట్వీట్ చేశారు.
News December 26, 2025
రైతు భరోసా పథకం రద్దు.. క్లారిటీ

TGలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’ ఖండించింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని తేల్చిచెప్పింది. ప్రస్తుతం లబ్ధిదారులకు మాత్రమే సాయం అందేలా గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, సర్కార్ ఎలాంటి షరతులు విధించలేదని స్పష్టం చేసింది.


