News August 20, 2024

VSKP: చిన్నారుల మృతి.. ఆయనపై హత్య కేసు

image

ఉమ్మడి విశాఖ జిల్లా కోటవురట్ల(M) కైలాసపట్నంలోని అనాథ ఆశ్రమంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. పాయకరావుపేట(M) అరట్లకోటకు చెందిన పాస్టర్ కిరణ్ కుమార్ ఈ ఆశ్రమం నడుపుతున్నాడు. అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఆయనపై హత్య కేసు నమోదు చేశారు. పైఫొటోలో కనపడుతున్న చిన్న రేకుల షెడ్డులోనే దాదాపు 97 మంది పిల్లలతో ఆశ్రమం నిర్వహిస్తుండగా.. దీనికి అనుమతులు లేవని సమాచారం.

Similar News

News January 10, 2026

పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో 17న తుక్కు వేలం

image

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.

News January 10, 2026

విశాఖ: సంక్రాంతి వేళ రైతు బజార్లకు సెలవు రద్దు

image

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రైతు బజార్లకు ఉండే వారాంతపు సెలవులను రద్దు చేస్తున్నట్లు DD శ్రీనివాస్ కిరణ్ తెలిపారు. ఈ మంగళవారం, బుధవారం కూడా రైతు బజార్లు యథావిధిగా తెరిచే ఉంటాయని వెల్లడించారు. పండుగకు అవసరమైన కూరగాయలు, సరుకుల కొనుగోలు కోసం ప్రజలు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 10, 2026

బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన

image

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేకువజాము నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీదళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.