News April 10, 2025

VSUలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై అవగాహన

image

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన విద్యా విధానం విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి దోహదపడేలా రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఈపీ-2020 కోఆర్డినేటర్ మధుమతి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

జగన్‌తో మాజీ మంత్రి అనిల్ భేటీ

image

తాడేపల్లిలో YCP అధినేత జగన్‌ను ఆయన నివాసంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. నాయకులు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మరింతగా ముందుకు వెళ్లాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

News November 13, 2025

నెల్లూరు: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

image

యువతి ఒంటరిగా కనిపిస్తే అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులున్న ఈ సమాజంలో విజయవాడ ఆటోడ్రైవర్లు మానవత్వం చూపించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో మానసిక వేదనకు గురై నెల్లూరు నుంచి విజయవాడ చేరుకుని యువతికి అండగా నిలిచారు. పర్సు పొగొట్టుకుని, ఫోన్, డబ్బుల్లేక బస్టాండ్‌లో ఆకలితో అలమటిస్తున్న ఆమెకి అండగా నిలిచారు. పోలీసులకు సమాచారమిచ్చి ఆమెను సురక్షిత కేంద్రానికి చేర్చిన ఆటో వాలాలపై అభినందనలు వస్తున్నాయి.

News November 13, 2025

నెల్లూరు: సాయం కోసం 12,293 మంది రైతుల ఎదురుచూపులు

image

అన్నదాత సుఖీభవ కింద ఖాతాలకు జమ కావలసిన రూ.20 వేల కోసం నెల్లూరు జిల్లాలోని 12,293 మంది రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 2 లక్షల మందికి పైగా రైతులకు జమ అయింది. కానీ సాంకేతిక కారణాలతో జమ కాని 12,293 మంది రైతులు సాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు వివాదాల కారణంగా ఆగినవి కాకుండా మిగిలిన అన్నీ కూడా అధికారులు తగిన శ్రద్ధ చూపిస్తే సత్వరమే పరిష్కారం అయ్యేవేనని సమాచారం..