News August 15, 2024
వీవీఎస్కు మరో ఏడాదీ తప్పడం లేదు!

NCA చీఫ్గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్ టీమ్కు హెడ్కోచ్గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.
Similar News
News December 15, 2025
వాస్తు నియమాలు ఎందుకు పాటించాలి?

ప్రకృతి, మానవ జీవన మనుగడలను సమన్వయం చేస్తూ మనల్ని రక్షించే శాస్త్రమే ‘వాస్తు’ అని, మన క్షేమం కోసం వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని అంటున్నారు. పరిసరాల వాస్తు కూడా ముఖ్యమే అంటున్నారు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుందని కుటుంబలో ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 15, 2025
జనవరిలో భారీ ఓపెనింగ్స్.. ప్రిపేర్ అవ్వండి!

డిసెంబర్ ‘డ్రై మంత్’ ముగియగానే జనవరిలో ఐటీ కంపెనీలు భారీ నియామకాలు చేపట్టడానికి సిద్ధమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇయర్ ఎండ్ ఆడిట్లు, బడ్జెట్ ప్రణాళికలు పూర్తవడంతో డిసెంబర్లో ఇంటర్వ్యూలు ఆగిపోతాయి. జనవరి ఓపెనింగ్స్ కోసం HR టీమ్స్ ప్లాన్ చేసుకుంటాయి. రాబోయే నోటిఫికేషన్లు, లక్ష్యంగా చేసుకోవాల్సిన కంపెనీలపై ప్రణాళిక వేసుకొని సిద్ధంగా ఉండాలి’ అని నిపుణులు సలహా ఇస్తున్నారు. SHARE IT
News December 15, 2025
‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం

AP: రాష్ట్రావతరణ దినంపై కొందరు రాజకీయం చేస్తున్నారని CM CBN మండిపడ్డారు. ‘‘పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో 1953 OCT 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1956 NOV 1న AP ఏర్పాటైంది. ఈ తేదీలపై కొందరు రాజకీయం చేస్తున్నారు. అందుకే శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా నిర్వహించాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. చెన్నైలోని ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని మెమోరియల్గా తీర్చిదిద్దుతామని తెలిపారు.


