News August 15, 2024
వీవీఎస్కు మరో ఏడాదీ తప్పడం లేదు!

NCA చీఫ్గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్ టీమ్కు హెడ్కోచ్గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.
Similar News
News February 18, 2026
మీరు ఎన్నటికీ గెలవలేరు: ఖమేనీ

ఇస్లామిక్ రిపబ్లిక్ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అన్నారు. ‘వారిది ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి అని US అధ్యక్షుడు చెబుతున్నారు. అలాంటి శక్తి కూడా తీవ్రంగా దెబ్బతినొచ్చు. మళ్లీ కోలుకోదు. యుద్ధనౌకలు ప్రమాదకరమే. కానీ వాటిని సముద్రం అడుగుకు పంపగల ఆయుధాలు ఇంకా ప్రమాదకరం’ అని హెచ్చరించారు. తమ అణు పరిశ్రమ దేశాన్ని నడిపించేందుకేనని, యుద్ధానికి కాదని చెప్పారు.
News February 18, 2026
హిందువులు ముగ్గురు పిల్లల్ని కనాలి: భాగవత్

దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘హిందువులను శక్తిమంతం చేయాలి. ఇప్పుడు ఎలాంటి ముప్పు లేదు. కానీ అప్రమత్తత అవసరం’ అని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చొరబాటుదారులను గుర్తించి పంపేయాలని, ఉపాధి కల్పించకూడదని అన్నారు.
News February 18, 2026
ఆస్ట్రేలియా ఔట్.. వరుసగా మూడో సారి!

వరుస ఓటములతో టీ20 WC సూపర్-8 రేసు నుంచి ఆస్ట్రేలియా <<19167885>>నిష్క్రమించడం<<>> తెలిసిందే. సెమీఫైనల్ దాకా చేరకుండా ఆ జట్టు వైదొలగడం వరుసగా మూడో సారి. 2021లో ఆసీస్ ఛాంపియన్గా నిలిచింది. కానీ 2022లో సూపర్-12, 2024లో సూపర్-8 దశలోనే ఇంటిదారి పట్టింది. 2024లో అఫ్గాన్ దెబ్బకొడితే, ఈసారి జింబాబ్వే షాకిచ్చింది. దీంతో లీగ్ దశలో ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పలేదు.


