News August 15, 2024
వీవీఎస్కు మరో ఏడాదీ తప్పడం లేదు!

NCA చీఫ్గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్ టీమ్కు హెడ్కోచ్గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.
Similar News
News January 6, 2026
చిత్తూరు జిల్లాలో తగ్గిన పంచాయతీలు

పునర్విభజన కారణంగా చిత్తూరు జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 696 పంచాయతీలున్న జిల్లాలో తాజాగా ఆ సంఖ్య 621కి తగ్గింది.75 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు వెళ్లాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం మండలాలను మదనపల్లె జిల్లాలో కలపడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది.
News January 6, 2026
వారే నిజమైన హీరోయిన్.. అనసూయ ఆసక్తికర పోస్ట్

నిన్న హీరోయిన్ <<18770152>>రాశీకి<<>> క్షమాపణలు చెప్పిన నటి అనసూయ మరోసారి ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘హీరోయిన్ తెరపై కాదు. సత్యం మాట్లాడే ధైర్యం. సొంత దారిలో నడిచే శక్తి. సరైనదానికి నిలబడే గుండె. అదే నిజమైన హీరోయిన్. మిగతావాళ్లు కేవలం నటులే’ అని రాసుకొచ్చారు. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో అని మరో చర్చ మొదలైంది. గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News January 6, 2026
BREAKING: విజయ్కు సీబీఐ నోటీసులు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.


