News August 15, 2024

వీవీఎస్‌కు మరో ఏడాదీ తప్పడం లేదు!

image

NCA చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్‌ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.

Similar News

News December 15, 2025

తిరుమల.. మార్చి నెల టోకెన్ల విడుదల తేదీలివే

image

⁎ మార్చి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా DEC 18న 10amకి ఆన్‌లైన్‌లో విడుదల, 20వ తేదీ 10am వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు, టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ 12pmలోగా నగదు చెల్లించాలి
⁎ 22న 10amకి కల్యాణోత్సవం, తెప్పోత్స‌వాల‌ టికెట్లు, 3pmకి వర్చువల్ సేవల కోటా రిలీజ్
⁎ 23న 10amకి అంగప్రదక్షిణ, 11amకి శ్రీవాణి ట్రస్ట్, 3pmకి వృద్ధులు, దివ్యాంగుల కోటా, 24న 10amకి ₹300 టికెట్లు, 3pmకి గదుల కోటా విడుదల

News December 15, 2025

T20 సిరీస్‌ నుంచి అక్షర్ పటేల్ ఔట్

image

సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచులకు టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు మ్యాచులకు ఆయన అందుబాటులో ఉండరని తెలిపింది. అక్షర్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకుంది. 5 మ్యాచుల T20 సిరీస్‌లో ఇప్పటివరకు 3 మ్యాచులు జరగగా IND 2, SA 1 గెలిచాయి. ఈ నెల 17న 4th, 19న 5th టీ20 జరగనుంది.

News December 15, 2025

మెస్సీ టూర్ గందరగోళం.. కలకత్తా హైకోర్టులో PIL

image

ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో ఏర్పడిన గందరగోళంపై హైకోర్టులో PILలు దాఖలయ్యాయి. వీటిని స్వీకరించిన కోర్టు వచ్చేవారం విచారిస్తామని పేర్కొంది. LOP సువేందు అధికారి తదితరులు వీటిని దాఖలు చేశారు. నిష్పాక్షిక దర్యాప్తుకోసం CBI, ED, SFIOతో విచారించాలని కోరారు. కాగా మిస్‌మేనేజ్మెంటు, స్టేడియంలో విధ్వంసం ఘటనలపై CM మమత రాష్ట్ర ప్రభుత్వ కమిటీతో విచారణకు ఆదేశించడం తెలిసిందే.