News August 15, 2024
వీవీఎస్కు మరో ఏడాదీ తప్పడం లేదు!

NCA చీఫ్గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్ టీమ్కు హెడ్కోచ్గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.
Similar News
News December 19, 2025
ఇవాళ, రేపు జాగ్రత్త

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఇవాళ, రేపు సింగిల్ డిజిట్కు టెంపరేచర్లు చేరుతాయని అంచనా వేశారు. HYDలోని పలు ప్రాంతాల్లో 5-8 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. చలితీవ్రత పెరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే వారం ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందన్నారు.
News December 19, 2025
ఎల్లుండి భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్

U19 మెన్స్ ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ ఫైనల్కు చేరాయి. సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై భారత్, సెమీస్-2లో బంగ్లాదేశ్పై పాక్ గెలిచాయి. ఈ నెల 21న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్-1లో తొలుత SL 138-8 స్కోర్ చేయగా, IND 18 ఓవర్లలో ఛేదించింది. ఆరోన్ జార్జ్ 58, విహాన్ 61 పరుగులతో రాణించారు. SF-2లో ఫస్ట్ BAN 121 రన్స్కు ఆలౌట్ కాగా, పాక్ 16.3 ఓవర్లలో టార్గెట్ను ఛేదించింది.
News December 19, 2025
కాకి లెక్కలతో క్యాన్సర్ కట్టడి ఎలా?

దేశంలో ఏటా 10 లక్షల మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్స్తో వ్యాధి, బాధితులపై సరైన లెక్కలు లేవు. సమగ్ర డేటా ఉంటే బడ్జెట్, మెడిసిన్, ఆస్పత్రుల నిర్మాణం, కంట్రోల్ కోసం చర్యలను స్పష్టంగా టార్గెట్ చేయొచ్చు. ప్రస్తుత కాకి లెక్కలతో కట్టడి కష్టమే. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ‘కచ్చితంగా గుర్తించదగ్గ వ్యాధి’గా ప్రకటించాలని SC ఇటీవలే ఆదేశించింది.


