News August 15, 2024

వీవీఎస్‌కు మరో ఏడాదీ తప్పడం లేదు!

image

NCA చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్‌ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.

Similar News

News December 22, 2025

ప్రజల్లోకి KCR.. దళపతి ముందు 2 సవాళ్లు

image

AP నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి. మొదటిది కూతురు కవిత.. తనపై తప్ప KTR సహా BRS ముఖ్య నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమెపై, ప్రత్యర్థుల ప్రశ్నలపై ఏమంటారు? అటు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదని CM రేవంత్ విమర్శిస్తున్నారు. బయటకు వస్తున్న మాజీ సీఎం సభలోకీ వస్తారా? అనేది ఛాలెంజ్2.

News December 22, 2025

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>దామోదర్ <<>>వ్యాలీ కార్పొరేషన్‌ 16 ఓవర్‌మెన్ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా(మైనింగ్ Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 55 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.45వేలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.dvc.gov.in

News December 22, 2025

వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

image

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.