News August 15, 2024

వీవీఎస్‌కు మరో ఏడాదీ తప్పడం లేదు!

image

NCA చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్‌ టీమ్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.

Similar News

News January 5, 2026

పొద్దు తిరుగుడులో బోరాన్ లోపం – నివారణ

image

పొద్దుతిరుగుడు పంటకు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలను అందించాలి. పంట పూత దశలో బోరాన్ చాలా ముఖ్యం. ఇది లోపిస్తే మొక్కల లేత మరియు మధ్య ఆకులలో చివర్లు గుండ్రంగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. అందుకే ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 5, 2026

ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. హరీశ్‌కు ఊరట

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటు మాజీ DCP రాధాకిషన్ రావును విచారించేందుకు అనుమతివ్వాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. గతంలో హరీశ్, రాధాకిషన్‌పై FIR నమోదు కాగా హైకోర్టు దాన్ని క్వాష్ చేసింది. దీంతో ప్రభుత్వం SCని ఆశ్రయించింది. అయితే HC ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని SC తాజాగా స్పష్టం చేసింది.

News January 5, 2026

ఢిల్లీ అల్లర్ల కేసు.. ప్రధాన నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత!

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు SCలో చుక్కెదురైంది. నిందితులపై ఉన్న ఆరోపణలు నిజమని నమ్మడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. UAPA కింద రూల్స్ కఠినంగా ఉంటాయని, కేవలం ట్రయల్ లేట్ అవుతోందన్న కారణంతో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. మరో ఐదుగురిపై ఉన్న ఆరోపణల తీవ్రత తక్కువ ఉన్న దృష్ట్యా వారికి మాత్రం బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.