News August 15, 2024
వీవీఎస్కు మరో ఏడాదీ తప్పడం లేదు!

NCA చీఫ్గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్ టీమ్కు హెడ్కోచ్గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.
Similar News
News January 20, 2026
నం.3లో ఇషాన్ కిషన్ ఆడతారు: సూర్య

రేపు NZతో జరిగే తొలి T20లో ఇషాన్ కిషన్ నం.3లో బ్యాటింగ్ చేస్తారని కెప్టెన్ SKY తెలిపారు. శ్రేయస్ కంటే ముందే బ్యాటింగ్ చేయడానికి అతను అర్హుడన్నారు. మరోవైపు తన ఆటతీరులో మార్పు ఉండదని, గతంలో మాదిరే బ్యాటింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. రేపటి నుంచి NZతో IND 5 మ్యాచుల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ నాగ్పూర్లో 7PMకు ప్రారంభమవుతుంది. JIO హాట్స్టార్, స్టార్స్పోర్ట్స్ నెట్వర్క్లో LIVE చూడొచ్చు.
News January 20, 2026
APలో RMZ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

AP: రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు RMZ సంస్థ ముందుకొచ్చింది. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ ఛైర్మన్ మనోజ్ మెండా తెలిపారు. దావోస్ సమ్మిట్లో మంత్రి లోకేశ్తో సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. విశాఖ కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్లో 50 ఎకరాల్లో జీసీసీ పార్క్ అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. 1Gw వరకు హైపర్స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ప్లాన్లు రెడీ చేస్తున్నామని పేర్కొన్నారు.
News January 20, 2026
నైనీ కోల్ టెండర్లపై CBIతో విచారించాలి: రాంచందర్

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంతో CM, మంత్రుల విభేదాలు బట్టబయలయ్యాయని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. ‘బంధువులకు గనులు కేటాయించుకోవాలని చూశారు. మీడియాలో వార్తలతో టెండర్లు రద్దు చేశారు. దీనిపై CBI, మరేదైన సంస్థతో విచారించాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత BRSకు లేదన్నారు. BRS హయాం నుంచి ఇప్పటి INC GOVT వరకు జరిగిన అవినీతిపై విచారణ జరగాలని పేర్కొన్నారు.


