News August 15, 2024
వీవీఎస్కు మరో ఏడాదీ తప్పడం లేదు!

NCA చీఫ్గా వీవీఎస్ లక్ష్మణ్ మరో ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన మూడేళ్ల పదవీకాలం సెప్టెంబర్లో ముగుస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఐపీఎల్ టీమ్కు హెడ్కోచ్గా పనిచేయాలని భావించారు. త్వరలో కొత్త NCA ప్రారంభిస్తుండటం, భారత్-ఏ జట్టు భవిష్యత్తు పర్యటన ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉండటంతో బీసీసీఐ ఆయన్ను వదులుకొనేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. దీంతో మరికొన్నాళ్లు ఆయన బెంగళూరుకే పరిమితమయ్యే అవకాశముంది.
Similar News
News February 1, 2026
సెమీస్కు భారత్! పాక్ గెలిచినా ఇంటికే..

U19 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని <<19023246>>33.3<<>> ఓవర్లలోపు ఛేదించడంలో పాక్ విఫలమైంది. ఆ సమయానికి కేవలం 167/4 రన్స్ మాత్రమే చేయడంతో రన్రేట్ సమీకరణాల ప్రకారం భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. పాకిస్థాన్ జట్టు గెలుపు కోసం పోరాడుతోంది. ఈ మ్యాచ్ పాక్ గెలిస్తే ఇండియా ఎల్లుండి ఆసీస్తో, ఓడితే FEB 4న ఆఫ్గాన్తో సెమీఫైనల్లో తలపడనుంది.
News February 1, 2026
ఫోన్ ట్యాపింగ్పై ఆదేశాలు ఇవ్వలేదు: KCR

TG: ఫోన్ ట్యాపింగ్పై తాను ఆదేశాలు ఇవ్వలేదని KCR సిట్ విచారణలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై GOVTకి నివేదించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్కు ఉంటుంది. MLAల కొనుగోలు సమాచారం అలాగే వచ్చింది. అదెలా సేకరించారో CMకు అవసరం లేదు కదా? అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని, ఆ అవసరం పార్టీకి లేదని చెప్పినట్లు తెలిసింది.
News February 1, 2026
KCR పేరు వింటేనే మీకు వణుకు: KTR

TG: KCRను సిట్ అధికారులు విచారించడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా స్పందించారు. KCR వ్యక్తి కాదని, తెలంగాణ చరిత్ర అని కొనియాడారు. ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని ధీశాలి.. ఇలాంటి చిల్లర రాజకీయాలకు భయపడరన్నారు. ‘మూర్ఖులు చరిత్రను సృష్టించలేరు. అర్థం కూడా చేసుకోలేరు. ఆయన పేరు వింటేనే మీకు వణుకు పుడుతుంది’ అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏం చేసినా KCR కీర్తిని చెరిపేయలేరని ధీమా వ్యక్తం చేశారు.


