News July 8, 2024

VZM: అక్ర‌మ మైనింగ్‌ను సహించేది లేదు: కలెక్టర్ అంబేడ్కర్

image

విజయనగరం జిల్లాలో ప‌లు మండలాలలో అక్ర‌మంగా గ్రావెల్‌, మ‌ట్టి త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఇక పై జిల్లాలో అక్ర‌మ మైనింగ్ జరిగిన స‌హించేది లేద‌ని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులు నిఘా పెట్టి వాటిని నిరోధించాల‌న్నారు. భవిష్యత్తులో అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన‌ట్లు ఫిర్యాదులు వ‌స్తే ‌ఎమ్మార్వోల‌నే బాధ్యుల‌ను చేస్తామ‌ని హెచ్చరించారు.

Similar News

News December 14, 2025

కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొత్తవలస (M) తుమ్మకాపల్లి ఫైర్ స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లశంకర్రావు (52) మృతి చెందాడు. వేపాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గొల్ల దారప్పడు, గొల్ల శంకర్రావు ద్విచక్ర వాహనంపై పిల్లలతో విశాఖ బీచ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో శంకర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దారప్పడును KGHకి తరలించారు. పిల్లలు భవాని, శంకర్ గాయపడ్డారు.

News December 14, 2025

VZM: రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి 5 ఆలయాల్లో చోరీ

image

వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు SI సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి సొమ్ము దొంగలించినట్లు వెల్లడించారు. దొంగలించిన సోమ్ము సుమారు రూ.41 వేలు ఉంటుందన్నారు. క్లూస్ టీమ్‌తో తనిఖీలు నిర్వహించారు. అర్చకుడు కిషోర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.

News December 14, 2025

విజయనగరం కలెక్టరేట్‌లో రేపు PGRS: కలెక్టర్

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు PGRS నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు పూర్వపు స్లిప్పులతో రావాలని సూచించారు. అర్జీల కోసం 1100 కాల్ సెంటర్, Meekosam.ap.gov.in సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.