News March 29, 2024
VZM: అప్పుడే రాజమండ్రి నుంచి వచ్చి మృత్యు ఒడిలోకి
రామభద్రపురం మండలం కొట్టక్కి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందులో జన్నివలసకి చెందిన జొన్నాడ పురుషోత్తం రాజమండ్రి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంత పనులు నిమిత్తం రాజమండ్రి నుంచి బైక్పై జన్నివలస గురువారం సాయంత్రమే వచ్చాడు, పనిమీద సాలూరు వెళ్లి వస్తుండగా చనిపోయాడు. మృత్యువు వెంటాడిందంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
Similar News
News January 20, 2025
డయేరియా కేసులపై మంత్రి కొండపల్లి ఆరా
బొండపల్లి మండలం బిల్లలవలస డయేరియా కేసుల నమోదు ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరా తీశారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. జిల్లా వైద్యాధికారులను వెంటనే అప్రమత్తం చెయ్యాలని సూచించారు. గ్రామాన్ని సందర్శించి, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసుకొని, గ్రామంలో ఇకపై వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News January 20, 2025
బొబ్బిలి: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి
డోంకినవలస-బొబ్బిలి రైల్వే స్టేషన్ల మధ్య, గొల్లాది రైల్వే గేట్ దగ్గరలో రైల్వే ట్రాక్ మధ్యలో మహిళ మృతదేహం పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు మహిళ ఏదయినా గుర్తు తెలియని రైలు నుంచి జారి పడిపోవడం వల్ల గాని ఢీ కొట్టడం వల్లగాని తగిలిన గాయాలతో చనిపోయి ఉండవచ్చని తెలిపారు. విజయనగరం GRP SI V.బాలాజీరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News January 20, 2025
విజయనగరం మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయనగరం మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయనగరంతో పాటు రాజమండ్రి, దువ్వాడ, తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.