News December 21, 2024

VZM: అసభ్య ప్రవర్తన ఆరోపణలతో టీచర్ సస్పెండ్ 

image

కొత్తవలస మండలం వీరభద్రపురం ఎంపీయూపీ పాఠశాల టీచర్ సన్యాసిరావుపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తనను కులం పేరుతో తిట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడని అదే స్కూల్ టీచర్ వాపోయారు. విద్యార్థినులతో సైతం అసభ్యకరంగా ప్రవర్తించి.. వారికి అసభ్యకరమైన వీడియోలు చూపిస్తున్నారని ఆమె విమర్శించారు. దీంతో సన్యాసిరావును డీఈవో మాణిక్యం నాయుడు సస్పెండ్ చేశారు. ఆ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావును HM బాధ్యతలు తప్పించారు.

Similar News

News January 23, 2025

ఆనందంగా గడిపారు.. అంతలోనే విషాదం

image

అగనంపూడి టోల్‌గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో <<15230832>>మృతి చెందిన<<>> గొర్లి మన్మథరావు(38), అరుణ కుమారి (32) సంక్రాంతికి పిల్లలతో కలిసి గడిసింగుపురం వచ్చారు. గ్రామంలో ఆనందంగా గడిపిన వారు.. కనుమ మరుసటి రోజే పయనమయ్యారు. ఫార్మాసిటీలో వెల్డర్‌గా పనిచేస్తున్న మన్మథరావు బుధవారం సెలవు పెట్టి భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News January 23, 2025

పార్వతీపురం: వలస వెళ్లి విగత జీవులయ్యారు..!

image

బతుకుతెరువుకు ఊరొదిలి వెళ్లిన ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు వెంటాడడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. <<15222234>>అగనంపూడి <<>>టోల్‌గేట్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15225242>>మృతి చెందిన <<>>గొర్లి మన్మథరావు, అరుణకుమారి జి.ఎం వలస(M) గడిసింగుపురం నుంచి రెండేళ్ల క్రితం వలస వచ్చారు. మన్మథరావు ఫార్మాసిటీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు నిఖిల్, కూతురు నీలిమ ఉన్నారు.

News January 23, 2025

విజయనగరం జిల్లాలో 5 ఆసుపత్రులు.. 13 ప్రత్యేక వైద్య బృందాలు

image

విజయనగరం జిల్లాలో గురువారం నుంచి దివ్యాంగుల పింఛన్ల పరిశీలన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం జిల్లాలోని ఐదు ఆసుపత్రులు, 13 ప్రత్యేక వైద్య బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. శారీరక దివ్యాంగుల కోసం గజపతినగరం, చీపురుపల్లి, రాజాం, ఎస్ కోట, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, అందుల కోసం రాజాం, GGH, ఘోసాసుపత్రి, మూగ చెవిటి వారి కోసం GGH, ఘోషాసుపత్రిలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.