News July 28, 2024
VZM: ‘ఆగస్టు 9న సెలవు దినంగా ప్రకటించాలి’

ఏటా ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది . GO-3ను పక్కాగా అమలు చేయాలని, గిరిజన హక్కులు, చట్టాలను కాపాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. రోజురోజుకు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News October 26, 2025
VZM: తుఫాను కంట్రోల్ రూమ్ పరిశీలించిన ప్రత్యేకాధికారి

విజయనగరం జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను ఆదివారం పరిశీలించారు. తుఫాన్ సన్నద్ధతపై వివిధ శాఖలపై ముందస్తుగా సమీక్షించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్, ఇతర అధికారులు ప్రత్యేకాధికారికి వివరించారు.
News October 26, 2025
VZM: తుఫాను ఎఫెక్ట్.. ప్రత్యేకాధికారిగా సుభాష్

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వివిధ జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. విజయనగరం జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారిగా సుభాష్ను నియమిస్తూ ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాకు చేరుకున్నారు.
News October 26, 2025
VZM: 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు

మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశాలతో 27, 28, 29వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు RIO తవిటినాయుడు, ICDS పీడీ శాంతకుమారి తెలిపారు. అన్ని కళాశాలలు మూసివేయాలని, ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని సూచించారు. కాగా.. 3 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు <<18111583>>పాఠశాలలకు<<>> సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.


