News March 11, 2025
VZM: ఇంటర్ పరీక్షకు 1,012 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఫిజిక్స్, ఎకనామిక్స్, ఒకేషనల్ విద్యార్థులు 1,012 మంది గైర్హాజరు అయ్యారని ఆర్ఐఓ ఎం.ఆదినారాయణ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 22,398 మంది హాజరు కావాల్సి ఉండగా వారిలో 21,386 మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కి పాల్పడకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
Similar News
News November 18, 2025
మెరకముడిదాం : ఉపాధ్యాయుడుని సత్కరించిన విజయనగరం ఎంపి

మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మరడాన సత్యారావుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం సత్కరించారు. 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను పదవతరగతి విద్యార్థులను విమానం ఎక్కించినందుకు సత్యారావుని ఎంపి అభినందించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను విమానం ఎక్కిస్తానని సత్యారావు తెలిపారు.
News November 18, 2025
‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
News November 18, 2025
‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.


