News March 1, 2025

VZM: ఇంటర్ పరీక్షలకు 20,964మంది హాజరు

image

విజయనగరం జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 20,964మంది విద్యార్థులు రాసినట్లు ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు. జిల్లాలో 166 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 18,686మందికి 18,178మంది ఓకేషనల్ విద్యార్థులు 2980 మందికి 2786మంది హాజరయ్యారన్నారు. పరీక్షలలో ఎటువంటి చూసి రాతలు జరగకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు ఆదినారాయణ చెప్పారు.

Similar News

News March 2, 2025

మహిళా సిబ్బందికి యోగా తరగతులు: ఎస్పీ

image

మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మహిళా పోలీసు సిబ్బందికి ఆదివారం ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. యోగ అనేది శరీరానికి, మనస్సుకి, ఆత్మకు శాంతి కలిగించే ప్రాచీనమైన సాధన అని అన్నారు. యోగ తరగతులు మహిళాలకు ఉపయోగకరమన్నారు.

News March 2, 2025

విజయనగరం వ్యాయమ ఉపాధ్యాయుల జిల్లా సంఘం ఎన్నిక 

image

వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎంపికయ్యారు. కార్యదర్శిగా ఎన్నికైన వెంకటనాయుడు పెంట జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నాడు. విజయనగరంలో ఆదివారం జరిగిన జిల్లా సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి ఎంపికపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యాయమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని వీరు తెలిపారు. 

News March 2, 2025

చీపురుపల్లి కనక మహాలక్ష్మిని దర్శించుకున్న జడ్పీ ఛైర్మన్

image

చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని ZPఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జాతరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

error: Content is protected !!