News September 12, 2024
VZM: ‘ఈనెల 25 వరకు ఛాన్స్’

ఏపీ ఓపెన్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి పది, ఇంటర్ లో జాయిన్ అవ్వడానికి గడువు పొడిగించినట్లు డీఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఫైన్ లేకుండా ఈనెల 15లోగా అప్లై చేసుకోవచ్చన్నారు. రూ.200 ఫైన్ తో ఈనెల 25 వరకు అవకాశం ఉందన్నారు. అర్హతగలవారు సంబంధిత వెబ్ సైట్లో
అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News December 7, 2025
గడిచిన 20 రోజుల్లో 45 మందికి జైలు శిక్ష: VZM SP

రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని SP దామోదర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. గడిచిన 20 రోజుల్లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 45 మందికి జైలు శిక్ష పడిందని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై 19,077కేసులు,మద్యం తాగి వాహనం నడిపిన వారిపై 5,510కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 17,246కేసులు నమోదు చేశామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగించాలన్నారు.
News December 7, 2025
VZM: కలెక్టర్ ఆఫీస్లో రేపు పీజీఆర్ఎస్

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో పాటు గత అర్జీల స్లిప్పులను తీసుకుని రావాలని సూచించారు. అర్జీ స్థితిగతుల కోసం మీకోసం కాల్ సెంటర్ 1100, అదేవిధంగా Meekosam.ap.gov.in వెబ్సైట్ను వినియోగించుకోవచ్చు అన్నారు.
News December 7, 2025
55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేసిన మంత్రి కొండపల్లి

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి కార్పొరేషన్ మండలి (COSIDICI) ఆధ్వర్యంలో శనివారం విశాఖలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందిన 16 మంది పారిశ్రామికవేత్తలకు జాతీయ గౌరవ పురస్కారాలు లభించాయని మంత్రి తెలిపారు.


