News February 8, 2025
VZM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.
Similar News
News November 16, 2025
MHBD: వ్యభిచార ముఠా గుట్టు రట్టు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాక రోడ్డులోని ఓ కాలనీలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పట్టణ పోలీసులు దాడులు చేశారు. టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. టౌన్ ఎస్సై సూరయ్య ఆధ్వర్యంలో జరిపిన సోదాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
News November 16, 2025
పెద్దపల్లి: నాణ్యమైన ధాన్యం కోరే రైతులకు కొత్త ఎంపిక

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన కె.ఎన్.యం-118 కొత్త రకం వరి వంగడాలు, యంటియు-1010కు మెరుగైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బత్తిని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎత్తు తక్కువ, బలమైన కాండం, నేలవాలని గుణం, సుదిదోమను (కొంతమేర) తట్టుకునే లక్షణాలు, 125 రోజుల్లో కోతకు సిద్ధమవ్వడం, ఎకరాకు 2.8-3.2 టన్నుల ఉత్తమ దిగుబడితో నాణ్యమైన ధాన్యాన్ని ఇవ్వడం దీని ప్రత్యేకత.
News November 16, 2025
వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. రాజన్నకు మొక్కుకున్న కోడె మొక్కును భీమేశ్వరాలయంలో చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


