News November 4, 2024

VZM: ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా జేసీ

image

శాస‌న‌మండలి స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక నిర్వ‌హ‌ణకు జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వ‌న్ రిట‌ర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రించనున్నారు. విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం జిల్లా రెవెన్యూ అధికారులు ఏ.ఆర్‌.ఓ.లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌తి రోజు ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌రకు జాయింట్ క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. న‌వంబ‌రు 11న మ‌ధ్యాహ్నం వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రిస్తారు.

Similar News

News November 5, 2025

పోష‌కాహారాన్ని స‌కాలంలో అందించాలి: VZM JC

image

జిల్లాలోని 2,499 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సకాలంలో అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎస్‌.సేథుమాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. సరుకుల సరఫరాలో జాప్యం లేకుండా, నాణ్యమైన బియ్యం, పప్పు, నూనె అందించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ డైరెక్టర్ విమల రాణి, సివిల్ సప్లయిస్ డీఎం శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News November 5, 2025

VZM: పీజీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

image

ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు విశ్వవిద్యాలయంకి వెళ్లిన తనిఖీ బృందం గుర్తించింది. దీంతో ఈ విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఏ.యూ స్పష్టం చేసింది.

News November 5, 2025

పెట్టుబడులపై అవగాహన కల్పించండి: మంత్రి కొండపల్లి

image

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలు, తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి వారికి పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అన్నారు.