News March 31, 2024
VZM: ‘ఏప్రిల్ 14లోగా ఓటుకోసం ధరఖాస్తు చేసుకోవాలి’
18 సంవత్సరాలు నిండినవారంతా ఏప్రిల్ 14వ తేదీలోగా ఓటుకోసం ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వాటిని పరిశీలించి 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. వీరికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో కొత్తగా ఓటేసే అవకాశం లభిస్తుందని, అర్హత ఉన్నవారంతా ఓటు హక్కు పొందడమే కాకుండా, ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News September 30, 2024
VZM: యువతకు ఎస్పీ కీలక సూచనలు
ప్రస్తుతం గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతూ, చట్టాలను కూడా కఠినతరం చేశామన్న విషయాన్ని యువత గమనించాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడుతుందన్నారు. గంజాయి కేసుల్లో ఎక్కువగా యువత పట్టుబడుతూ.. జైల్లో మగ్గుతున్నారని ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.
News September 30, 2024
విజయనగరం: TODAY TOP NEWS
⁍VZM: దసరా సెలవులు ఆరు రోజులే
⁍పార్వతీపురం దిశ సెల్ ఎస్ఐలు వీరే
⁍బొబ్బిలిలో కొండచిలువ హతం
⁍విజయనగరం జిల్లాలో ఎక్సైజ్ సీఐలకు బదిలీలు
⁍విజయనగరం జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రాలివే
⁍పైడితల్లమ్మ సిరిమాను చెట్టుకు పూజలు
⁍రేపు బొబ్బిలి రానున్న సినీ నటుడు సాయికుమార్
⁍కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్డెడ్
⁍నిండుకుండలా తాటిపూడి జలాశయం
⁍రామతీర్థంలో రామచంద్ర ప్రభువుకు పట్టు పవిత్రాల సమర్పణ
News September 29, 2024
కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్డెడ్
కురుపాం మండలం వలసబల్లేరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నీలకంఠపురం SI తెలిపారు. ఘటనలో బిడ్డిక జూజారు, బిడ్డిక శ్రీను మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.