News July 19, 2024

VZM: ఏయూ వీసీగా కొత్తపల్లి వాసి

image

గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొట్టాపు శశిభూషణరావును విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. ఏయూలో సీయూసీ అధ్యాపకుడిగా 19 ఏళ్ల అనుభవం ఆయనకు ఉంది. 15 ఏళ్ల పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఇస్రోలో పనిచేశారు. ఆయన ఉన్నత స్థాయికి వెళ్లడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 7, 2024

పైడిమాంబ ఉత్సవాలు.. ఓం బిర్లాకు ఆహ్వానం

image

పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలో సోమవారం కలిశారు. విజయనగరంలో ఈనెల 13, 14, 15వ తేదీల్లో జరగనున్న శ్రీపైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని అందజేశారు.

News October 7, 2024

విజయనగరంలో వాలంటీర్ల నిరసన

image

విజయనగరంలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు సోమవారం ఉదయం నిరసనకు దిగారు. యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వాలంటరీల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను కొనసాగించాలని కోరారు.

News October 7, 2024

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ షెడ్యూల్ ఇదే

image

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం 8 గంటలకు బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.