News March 30, 2024
VZM: ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన మక్కువ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి పి మురళి, సాల్విన్ సర్టిఫికెట్ నిమిత్తం చీకటి గణపతి అనే వ్యక్తి నుంచి రూ.2,600 తీసుకుంటూ ఏసీబీ డిఎస్పీ, సిబ్బందికి దొరికాడు. దీనిపై ఏసీబీ కేసు నమోదుచేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 20, 2025
బొబ్బిలి: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి
డోంకినవలస-బొబ్బిలి రైల్వే స్టేషన్ల మధ్య, గొల్లాది రైల్వే గేట్ దగ్గరలో రైల్వే ట్రాక్ మధ్యలో మహిళ మృతదేహం పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు మహిళ ఏదయినా గుర్తు తెలియని రైలు నుంచి జారి పడిపోవడం వల్ల గాని ఢీ కొట్టడం వల్లగాని తగిలిన గాయాలతో చనిపోయి ఉండవచ్చని తెలిపారు. విజయనగరం GRP SI V.బాలాజీరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News January 20, 2025
విజయనగరం మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయనగరం మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయనగరంతో పాటు రాజమండ్రి, దువ్వాడ, తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News January 20, 2025
నెల్లిమర్లలో వైద్య విద్యార్థి ఆత్మహత్య
నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో MBBS చదువుతున్న వైద్య విద్యార్థి ఆతుకూరి సాయి మణిదీప్ ఆదివారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం, కుటుంబ సభ్యుల వేదనకు తానే కారణమవుతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్ రాసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.