News October 24, 2024
VZM: ఒకే రోజు హోం మంత్రి, మాజీ సీఎం పర్యటన

విజయనగరం జిల్లాలో నేడు హోం మంత్రి అనిత, వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఎన్నికల తర్వాత జగన్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అయిన తర్వాత అనిత జిల్లాకు రావడం ఇదే మొదటిసారి. జగన్ ఉదయం 11 గంటలకు గుర్ల డయేరియా బాధితులను పరామర్మించి తిరిగి బెంగళూరు వెళ్లనున్నారు. హోం మంత్రి మధ్యాహ్నం 2 గంటలకు గుర్లలో పర్యటిస్తారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు.
Similar News
News January 3, 2026
VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

AP KGBV ఔట్సోర్సింగ్లో 1095 పోస్టులకు <
News January 3, 2026
బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు కఠిన కారాగార శిక్షను విధించినట్లు SP దామోదర్ శుక్రవారం తెలిపారు. బాడంగి (M)కి చెందిన V.వెంకటరమణ అదే ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో 2024 డిసెంబర్లో పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
News January 3, 2026
గరుడుబిల్లిలో పాఠశాలలను తనిఖీ చేసిన : DEO

బొండపల్లి మండలం గరుడబిల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోవ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్న 100 రోజుల ప్రణాళిక నిర్వహణ, విద్యార్థి ప్రతిభ పరిశీలన చేసి ప్రతి విద్యార్థి సైనింగ్ స్టార్గా మార్చేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.


