News July 3, 2024
VZM: ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో విజయనగరం జిల్లా రాష్ట్రంలో వరుసగా 15, 16వ స్థానాల్లో నిలిచింది. పదో తరగతిలో 543 మందికి 369, ఇంటర్లో 658కి 411 మంది పాసైనట్లు డీఈవో ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. రీకౌంటింగ్కు దరఖాస్తు చేసేందుకు సబ్జెక్టుకు రూ.200, రీవెరిఫికేషన్కు రూ.1000 (సబ్జెక్టుకు) చొప్పున ఈనెల 13వ తేదీ లోపు ఆన్లైన్లో చెల్లించాలి.
Similar News
News October 27, 2025
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

మొంథా తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బొబ్బిలి రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు చెసే విశాఖ – కోరాపుట్ – విశాఖ పాసింజర్&ఎక్సప్రెస్, గుంటూరు – రాయగడ – గుంటూరు ఎక్సప్రెస్ను రైల్వే అధికారులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవనుండటంతో రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్శియల్ మేనేజర్ చెప్పారు.
News October 27, 2025
వచ్చేనెల సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు

సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నవంబర్ 1, 2వ తేదీల్లో స్థానిక రాజీవ్ స్టేడియంలో జరుగనున్నాయని జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరుగుతాయని చెప్పారు. ముందుగా ప్రకటించిన తేదీలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేయబడినట్లు వివరించారు. అర్హులైన ఉద్యోగులు గమనించి ఈ పోటీలకు హాజరు కావాలని సూచించారు.
News October 27, 2025
తీర ప్రాంతాల్లో పర్యటించిన విజయనగరం కలెక్టర్, ఎస్పీ

భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్ సోమవారం పర్యటించారు. తుఫాను పరిస్థితులను సమీక్షించారు. మత్స్యకారులు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.


