News February 4, 2025

VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన పాచిపెంట మండలం కర్రివలసలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం మండలం గొళ్ళలపేట గ్రామానికి చెందిన కె.రామారావు కర్రివలసలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ లైన్లు తగిలి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News November 27, 2025

విజయవాడ GGHలో వేధిస్తున్న MNO&FNOల కొరత..!

image

విజయవాడ జీజీహెచ్‌లో రోగులను వార్డుల్లోకి మార్చే (MNO/FNO) సిబ్బంది తీవ్ర కొరతతో అత్యవసర చికిత్సలకు అంతరాయం కలుగుతోంది. ఆసుపత్రిలో 1657 బెడ్లు ఉండగా, కనీసం 400 మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం 100 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన 4650 మంది సిబ్బంది నియామక ఫైలు ముందుకు కదలకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

News November 27, 2025

తూ.గో.లో మండపేట విలీనం.. పెరగనున్న పట్టణ జనాభా

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూ.గో జిల్లా పట్టణ జనాభా పెరగనుంది. మండపేట నియోజకవర్గాన్ని జిల్లాలో పూర్తిగా కలుపుతూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండపేట మున్సిపాలిటీ జిల్లా పరిధిలోకి చేరనుంది. ప్రస్తుతం రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతో కలిపి 4,27,380 ఉన్న జిల్లా పట్టణ జనాభా.. మండపేట చేరికతో 4,80,968కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News November 27, 2025

అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పోక్సో కోర్టు జడ్జి వై. వెన్నయ్య నాయుడు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ రాహుల్ మీనా బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం చిరుతపూడికి చెందిన కట్టా బ్రహ్మేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సత్వర దర్యాప్తుతో నిందితుడికి శిక్ష పడింది.