News February 4, 2025
VZM: కరెంట్ షాక్తో వ్యక్తి మృతి

కరెంట్ షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన పాచిపెంట మండలం కర్రివలసలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం మండలం గొళ్ళలపేట గ్రామానికి చెందిన కె.రామారావు కర్రివలసలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ లైన్లు తగిలి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News November 28, 2025
వనపర్తి: పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ నంబర్

వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08545-233525కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలియజేశారు.
News November 28, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు రన్నరప్

సంగారెడ్డిలో 3 రోజులుగా జరిగిన SGF రాష్ట్ర స్థాయి అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి ఖమ్మం జట్టు అద్భుత ప్రదర్శనతో ద్వితీయ స్థానం(రన్నరప్) సాధించింది. ఫైనల్ మ్యాచ్లో ఖమ్మం-HYD జట్లు తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన పోరులో చివరకు 6 పరుగుల స్వల్ప తేడాతో HYD జట్టు విజయం సాధించింది. ఖమ్మం జట్టు ప్రతిభావంతమైన ఆటతీరుతో రన్నరప్గా నిలవడంతో, జిల్లా క్రీడాకారులు, కోచ్లు అభినందనలు అందుకున్నారు.
News November 28, 2025
వేములవాడ TO అరుణాచలం RTC స్పెషల్ ప్యాకేజ్

వేములవాడ- అరుణాచలానికి RTC ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. DEC 6న ఉదయం వేములవాడలో బస్సు బయలుదేరి 7న కాణిపాకం, కంచి, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అదే రాత్రి అరుణాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ తెలిపారు. 8న అరుణాచల గిరిప్రదక్షిణ అనంతరం బయలుదేరి 9న జోగులాంబ దర్శనం అనంతరం బస్సు వేములవాడకు తిరిగి వస్తుందన్నారు. పెద్దలకు రూ.5,100, పిల్లలకు రూ.3,850లను టికెట్ ఛార్జీలుగా నిర్ణయించారు.


