News February 4, 2025

VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన పాచిపెంట మండలం కర్రివలసలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం మండలం గొళ్ళలపేట గ్రామానికి చెందిన కె.రామారావు కర్రివలసలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ లైన్లు తగిలి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News November 25, 2025

ఖమ్మం బస్టాండ్ వద్ద డ్రైనేజీలో మృతదేహం

image

ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, కుడి చేతికి సూర్యుడి టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి సమాచారంతో అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాస్‌ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని టూ టౌన్ పోలీసులు కోరారు.

News November 25, 2025

SKLM: మృత్యువుగా మారిన 3 చక్రాల బండి

image

మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సింహాచలం (43) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సింహాచలం 3 చక్రాల స్కూటీపై జాతీయరహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో హరిపురం సీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మందస పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 25, 2025

నంద్యాల: కేసీ కెనాల్‌లో బాలుడి మృతదేహం

image

గోస్పాడు మండలం సాంబవరం గ్రామం వద్ద కేసీ కెనాల్‌లో పొన్నాపురానికి చెందిన ఖాజావలి అనే బాలుడి మృతదేహం లభ్యమయింది. ఖాజావలి సోమవారం మధ్యాహ్నం కేసీ కెనాల్ వద్ద ఆడుకుంటుండగా జారి కెనాల్‌లో పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సాంబవరం గ్రామం వద్ద ఖాజావలి మృతదేహం లభ్యమయింది. ఘటనపై గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేశారు.