News December 15, 2024

VZM: కలెక్టరేట్‌లో నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

image

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా బి.సి.సంక్షేమ శాఖ అధికారి పెంటోజీ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 10-30 గంటలకు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి అమరజీవికి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News November 14, 2025

VZM: ‘మధుమేహంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు’

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ పరీక్షలను శుక్రవారం నిర్వహించినట్లు DMHO జీవనరాణి తెలిపారు. మొత్తం 44 కార్యాలయాల సిబ్బందికి టెస్టులు చేయడంతో పాటు, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధుమేహంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మధుమేహంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

News November 14, 2025

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి, పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక యూత్ క్లబ్‌లో నిర్వహించిన రిసోర్స్ పర్సన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం పెరగడంతో భూమి సారం తగ్గిపోగా, అవశేషాలు ఆహారం ద్వారా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సహజ ఎరువులు భూమి సారాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.

News November 13, 2025

VZM: జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ఎక్కడంటే..!

image

రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. రైతులు తమ పత్తిని నేరుగా ఈ కేంద్రంలోనే విక్రయించాలని అధికారులు సూచించారు. కనీస మద్దతు ధర రూ.8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు కేంద్రంలో పారదర్శక తూకం, న్యాయమైన ధర, తక్షణ చెల్లింపు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.