News December 11, 2024
VZM: కొత్తగా వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటు..!
వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పూసపాటిరేగ, కొత్తవసల, మెరకముడిదాం మార్కెట్లు ఉన్నాయి. 20 మందితో కమిటీ ఏర్పాటు చేస్తారు. వీరిలో MLA, 12 మంది రైతులు, ముగ్గురు వ్యాపారులు, కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడీ, సర్పంచ్, వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు, గ్రామ సర్పంచ్ ఉంటారు.
Similar News
News January 19, 2025
VZM: గూగుల్ సెర్చ్ చేస్తున్నారా.. మీరే టార్గెట్
గూగుల్ సెర్చ్ చేస్తున్నవారినే టార్గెట్గా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని విజయనగరం SP వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఎక్కువ మంది తమకు అవసరమైన వాటిని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెతుకుతున్నారని ఆయన అన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను క్రియేట్ చేసి సెర్చ్ చేసే సమయంలో ఆ సైట్ ముందు వరుసలో వచ్చేలా చేసి డబ్బులు దోచుకుంటున్నారని, పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు.
News January 19, 2025
VZM: భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను
విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తూ శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ మంత్రి మంత్రి ముత్తంశెట్టి రాజీనామాతో ఆ ప్లేస్ను భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మజ్జి శ్రీనివాసరావు విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
News January 18, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ శనివారం సజావుగా జరిగింది. మొత్తం 600 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 517 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 83 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీరిలో 317 మంది తుదిరాత పరీక్షకు ఎంపికయ్యారన్నారు.