News December 31, 2024

VZM: కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ప్రజాప్రతినిధులు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన శ్రేయోభిలాషులను ఉద్దేశించి బొకేలు, శాలువాలు, పూలదండలు, స్వీట్లు తేవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రిని మాత్రమే తేవాలని పిలుపునిచ్చారు. దాదాపు ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సందేశాన్నే ప్రజల్లోకి తీసుకెళ్లారు.

Similar News

News December 9, 2025

VZM: జీజీహెచ్ సేవల మెరుగుదలపై అధికారుల సమీక్ష

image

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, MLA పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొని ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల రద్దీ, అవసరమైన మౌలిక వసతులు, పరికరాల అప్‌గ్రేడేషన్, శుభ్రత, వైద్యసిబ్బంది బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఇతర వైద్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

News December 9, 2025

ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

image

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 9, 2025

ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

image

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.