News July 14, 2024
VZM: గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 13 అంబేడ్కర్ గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఈనెల 18న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్ ఫ్లోరెన్స్ తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, గణితం,జువాలజీ, హిందీ, ఎకనామిక్స్, పీడీ, స్టాఫ్ నర్స్ వంటి కొలువులకు నెల్లిమర్ల గురుకులంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఉదయం 9:30కు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. >Share it
Similar News
News February 25, 2026
VZM: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 952 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 21,048 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 20,096 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 952 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.
News February 25, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు

పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు బుధవారం స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్. ఎం.వెంకటేశ్వరరావు హాజరై ప్రారంభించారు. వైకల్యం శరీరానికే తప్పా సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
News February 25, 2026
VZM: ‘పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి’

విజయనగరం జిల్లాలో రీసర్వే, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా 100% పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మితో జరిగిన వీసీ అనంతరం ఆయన మాట్లాడారు. రీసర్వే గ్రామాల్లో సర్వేయర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, డిప్యూటేషన్లు రద్దు చేయాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు.


