News June 28, 2024

VZM: జగన్ అక్కా చెల్లెమ్మలను మోసం చేశారు.. సీఐటీయూ

image

అక్క చెల్లెమ్మలను ఆదుకుంటామని మాజీ సీఎం జగన్ చేయూత లబ్ధి దారులను మోసం చేశారని ఆందోళన చేపట్టారు. విజయనగరం డీఆర్డీఏ కార్యాలయం వద్ద చేయూత లబ్ధిదారులు ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్యదర్శి వి. లక్ష్మి, సీఐటీయూ నగర అధ్యక్షుడు జగన్మోహన్ మాట్లాడారు. చేయూత 4వ విడతకి ఒక్కొక్కరికి రూ.18,750 ఇవ్వాలని బటన్ నిక్కిన జమకాలేదని ఆందోళన చేపట్టామన్నారు.

Similar News

News December 22, 2025

చట్ట పరిధిలో ఫిర్యాదులను పరిష్కరించాలి: VZM SP

image

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి 27 ఫిర్యాదులు అందాయి. భూతగాదాలు11, కుటుంబ కలహాలు 3, నగదు వ్యవహారాలు 2, మోసాలు1, ఇతర అంశాలు 10 ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదుల పూర్వాపరాలను పరిశీలించి, చట్ట పరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ సందర్బంగా ఆదేశించారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పాల్గొన్నారు.

News December 22, 2025

VZM: వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

image

ఏపీఎస్పీ బెటాలియన్లకు ఎంపికైన 208 స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమం విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకొని, మారుతున్న నేరాలు మరియు శాంతిభద్రతల సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని డీఐజీ సూచించారు.

News December 22, 2025

VZM: ‘PMAGY పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి’

image

ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన (PMAGY) పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఈ పథకం అమలుపై సోమవారం సమీక్ష జరిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 500 జనాభా కలిగి, 40% ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు. జిల్లాలోని మెరకముడిదాం, వంగర, తెర్లాం, ఆర్.ఆమదాలవలస మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని ప్రతిపాదించారు.