News October 25, 2024
VZM: జడ్పీలో నేడు సర్వ సభ్య సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ

జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా గుర్ల లో డయేరియా మరణాలు, వివిధ గ్రామాల్లో విజృంభిస్తున్న అంటువ్యాధులపై ప్రధానంగా చర్చ సాగనుంది. ఈ సమావేశానికి ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
Similar News
News November 11, 2025
గృహలబ్ధిదారుల వివరాలు నమోదు చేయండి: DRO

గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వేకు సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాల తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.
News November 10, 2025
గృహలబ్ధిదారుల వివరాలు నమోదు చేయండి: DRO

గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వేకు సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాల తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.
News November 10, 2025
వారం రోజుల్లో నివేదికలు సమర్పించాలి: ASP

ప్రజల ఫిర్యాదులను చట్టపరిధిలోని తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 42 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ, ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఫిర్యాదులను పరిశీలించి 7రోజుల్లో నివేదికలు సమర్పించాలని ఆమె ఆదేశించారు.


