News October 25, 2024
VZM: జడ్పీలో నేడు సర్వ సభ్య సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ

జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా గుర్ల లో డయేరియా మరణాలు, వివిధ గ్రామాల్లో విజృంభిస్తున్న అంటువ్యాధులపై ప్రధానంగా చర్చ సాగనుంది. ఈ సమావేశానికి ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
Similar News
News December 12, 2025
VZM: అరుదైన శస్త్ర చికిత్స

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో లక్ష్మీకాంతం(74) ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు అత్యంత క్లిష్టమైన తుంటి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డా.అల్లు పద్మజ తెలిపారు. గతంలో ఆమె కృత్రిమ తుంటి ఎముక అమర్చబడిన ఆమె, ఇటీవల కింద పడిపోవడంతో మళ్లీ ఎముక విరిగిందన్నారు. ప్రొఫెసర్ లోక్నాథ్ ఆధ్వర్యంలో పాత తుంటిని తీసివేసి కొత్తది అమర్చారని ఫిజియోథెరపి తర్వాత ఆమె నడుస్తోందన్నారు.
News December 12, 2025
VZM: జిల్లాలో ఎరువుల కొరత లేదు.. వ్యవసాయాధికారి

రబీ పంటల అవసరాలకు జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి రామారావు గురువారం తెలిపారు. ఇప్పటివరకు 8,058 మెట్రిక్ టన్నులు అందగా.. 5,110 టన్నులు రైతులకు విక్రయించారన్నారు. నెలాఖరుకి మరో 2,600 టన్నులు చేరనున్నాయని, ప్రస్తుతం 3,058 టన్నులు RSK, గోదాముల్లో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఏదీ లేదని, ఎంఆర్పీకి మించి అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 12, 2025
15న పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం: VZM కలెక్టర్

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం ఈనెల 15న విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆదేశించారు.


