News March 15, 2025

VZM: జిల్లాకు ప్రత్యేకాధికారి రాక

image

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణ చేసే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు శనివారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. 10.30 గంటలకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.

Similar News

News March 17, 2025

గుర్లలో నకిలీ ఏసీబీ డీఎస్పీ బెదిరింపులు

image

గుర్ల మండలంలో పలువురు అధికారులను గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి హడలెత్తించినట్లు సమాచారం. తాను ఏసీబీ DSPని అంటూ పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేశాడు. పలువురు అధికారులకు ఆదివారం ఫోన్ చేసి మీరు అవినీతికి పాల్పడుతున్నారని, అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని గుర్ల SI నారాయణరావు తెలిపారు.

News March 17, 2025

విజయనగరం జిల్లా ప్రజలకు హెచ్చరిక

image

విజయనగరం జిల్లాలో మంగళవారం, బుధవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదుయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, గుర్ల, L కోట, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం,సంతకవిటి, తెర్లాం, వంగర, S కోట మండల్లో 40 డిగ్రీల నమోదు అవ్వొచ్చని పేర్కొంది. వడగాల్పులు సైతం వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 17, 2025

VZM: ఆరుగురిపై కేసు నమోదు

image

ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై విజయనగరం జిల్లా పోలీసులు దృష్టి సారించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెట్టి వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆదివారం సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం శివారులో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై రాజాం పోలీసులు దాడులు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆరుగురు మందుబాబులపై కేసు నమోదు చేశారు.

error: Content is protected !!