News November 3, 2024

VZM: జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కారణం ఇదే

image

గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఇందుకూరి రఘురాజు ఎన్నికయ్యారు. సొంత పార్టీలో పొసగలేని రఘురాజు.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు అప్పటిలో వినిపించాయి. సార్వత్రిక ఎన్నికల ముందు రఘురాజు సతీమణి సుధారాణి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో రఘురాజుపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News October 23, 2025

సహకార సంస్థలు తమ డేటాను అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉన్న సహకార సంస్థలు తమ డేటాను జిల్లా సహకార అధికారికి అందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డేటాను నేషనల్ కో-ఆపరేటివ్ డేటా బేస్ పోర్టల్లో‌అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని, వినియోగంలోకి తేవాలని సూచించారు.

News October 23, 2025

VZM: జిల్లాకు బాక్సింగ్‌లో 4 రాష్ట్ర స్థాయి మెడల్స్

image

రాజమండ్రిలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో విజయనగరం జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-17 కేటగిరీలో దుర్గాప్రసాద్, సచిన్.. అండర్-19 కేటగిరీలో వర్ధన్ రెడ్డి, యశ్వంత్ బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని బుధవారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని కలెక్టర్ సూచించారు.

News October 23, 2025

అర్హులందరికీ ఇళ్లు మంజూరు: VZM కలెక్టర్

image

గృహాల లేఅవుట్‌లలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి అర్హులైన వారికి కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం అమరావతి నుంచి CCLA ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అందరికీ ఇళ్లు విధానంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.