News November 17, 2024
VZM: జిల్లాలో నిఘానేత్రాన్ని పటిష్ఠం చేస్తున్నాం: SP

జిల్లాలోని ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపులు, కాలేజ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని SP వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అదనంగా మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా షాపు యజమానులకు, వ్యాపారవేత్తలకు, అపార్టుమెంట్ వాసులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణకు డ్రోన్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు.
Similar News
News November 4, 2025
VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
News November 4, 2025
పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకం: VZM SP

జిల్లాలో నేరాలను అరికట్టడంలో పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకమని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్థులపై ప్రత్యేక బృందాలు కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి రవాణా, జూదాలు, కోడి పందాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
News November 4, 2025
రైల్వే స్టేషన్లలో సమస్యలపై ప్రస్తావించాం: VZM ఎంపీ

విజయనగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో వేచి ఉండే హాల్, మరుగుదొడ్లు, ఎస్కలేటర్లు, తదితర సదుపాయాలు కల్పించాలని ఎంపీ అప్పలనాయుడు కోరారు. విశాఖలో మంగళవారం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్కి హాల్ట్, భువనేశ్వర్, తిరుపతి రైళ్లను ప్రతిరోజూ నడపడం, శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని కోరినట్లు ఎంపీ తెలిపారు.


