News September 17, 2024

VZM: టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్న వివాహిత

image

సహజీవనం చేస్తున్న వ్యక్తి పెడుతున్న టార్చర్ భరించలేక రామనారాయణం వద్ద ఒక అపార్ట్మెంట్‌లో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాలూరులో అగ్రికల్చర్ ఏఈఓగా పనిచేస్తున్న రెడ్డి హైమావతి (34) నల్లగోపి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అనుమానంతో నిత్యం టార్చర్ పెట్టడంతో భరించలేక ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై అశోక్ కుమార్ తెలిపారు.

Similar News

News November 9, 2025

విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి

image

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి విశాఖలోని మల్కాపురంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అక్కడే ఓ బార్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యం బారిన పడిన గణపతి శనివారం అర్ధరాత్రి బార్ వద్దే ఆకస్మికంగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

News November 8, 2025

VZM: ఈనెల 12న YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టామని ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. గత 17 నెలల్లో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, మెడికల్ కాలేజీకి మాత్రం నిధులు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు.

News November 8, 2025

యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు

image

విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జమ్ము నారాయణపురం గ్రామం వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా బైక్ నుజ్జునుజ్జు అయింది. గాయపడిన ఇద్దరిని 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు విజయనగరంలోని దాసన్నపేటకు చెందిన వారని స్థానికులు తెలిపారు.